మారేడ్పల్లి : గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అమ్ముగూడ-సనత్నగర్ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. శరీర భాగాల నుంచి తల పూర్తిగా తెగిపోయింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతురాలి వయస్సు సూమారు 40-45 సంవత్సరాలు ఉంటాయని, ఒంటి పై బ్లూ రంగు, చీర, జాకెట్ ధరించి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించగలరని పోలీసులు తెలిపారు.