మైలార్దేవ్పల్లి :గుర్తు తెలియని వ్యక్తి (62)మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ గోపరాజు తెలిపిన వివరాల ప్రకారం..రెండురోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఆనారోగ్యంతో బాధపడుతూ ఓ ఇంటి ప్రక్కన రాళ్లపై పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియ దవాఖానకు తరలించారు. శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు స్థానికంగా బిక్షటన చేస్తూ జీవించేవడని స్థానికులు తెలిపారన్నారు.