బడంగ్పేట : బీజేపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తి లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తీక్రెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీలో నివాసం ఉంటున్న మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ 13 వ డివిజన్ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ (నందు)ను బుధవారం ఆయన పరామర్శించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరాడన్న నెపంతో నందు ఇంటిపైన దాడి చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. సమస్యల గురించి ప్రస్తావించకుండా ప్రతీకార దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
దౌర్జన్యం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్న ఆలోచనతో నరేంద్ర కుమార్ టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు. బీజేపీ కార్పొరేటర్స్కు, నాయకులకు అభివృద్ధి గురించి ఏ మాత్రం పట్టింపులేదన్నారు. వివాదాలు సృష్టించి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని మండిపడ్డా రు.
టీఆర్ఎస్ పార్టీలో చేరాలని తనను ఎవరు ఒత్తిడి చేయలేదని, తాను స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరానని 13వ డివిజన్ కార్పొరేటర్ నందకుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ లో చేరానన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మీర్పేట అధ్యక్షుడు అర్కల కామేశ్రెడ్డి, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్రెడ్డి, మహేశ్వరం నియోజక వర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, దీప్లాల్ హన్, కార్పొరేటర్స్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.