బంజారాహిల్స్ : పేదలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహమత్నగర్ డివిజన్కు చెందిన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా తదితర సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతాలు చేస్తూ చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మన్సూర్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.