ఆత్మకూరు, మార్చి 26 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైంది. ఎన్టీఆర్, రాంచరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఫ్యా న్స్లో సందడి నెలకొన్నది. టికెట్ రేట్లను పెంచుకోవచన్న ప్రభుత్వ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. థియేటర్ ఓనర్ల ప్రమే యం లేకుండా.. డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థే ఇష్టానుసారంగా టికెట్ ధరలను బ్లాక్లో వి క్రయిస్తున్నది. ఒక్కో టికెట్ను రూ.వెయ్యి వరకు అమ్ముతున్నారు. సాధారణ థియేటర్ల టికెట్ల ధరలు యథాతథంగా ఉంటాయని చెప్పినప్పటికీ.. ‘సీ’ క్లాస్ సెంటర్లోనూ రూ.200కు టికెట్టు ధరను పెంచి విక్రయిస్తున్నారు. ‘బీ’ క్లాస్ సెంటర్లో రూ. 300, ‘ఏ’ క్లాస్ సెంటర్లో అయితే ఏకంగా ఒక్క టిక్కెట్ ధర రూ.500లకు అమ్ముతున్నారు. కాగా, థియేటర్ల వద్ద అభిమానులు భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. వినూత్న పద్ధతుల్లో అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోగా అభిమానులు సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహం కనబరుస్తున్నారు. సినిమా సక్సెస్తో సంబురాలు చేసుకుంటున్నారు.