బండ్లగూడ : సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా జ్యోతిబా పూలే ఉత్సవాల కమిటి అధ్యక్షులు బంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చదువును చాలేంజ్గా తీసుకుని విద్యార్థులు విద్యను అభ్యసించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్పొరేటర్లు మోండ్ర సంగీత, పి.అర్చన జయప్రకాశ్,రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య, అడికె అర్జున్, సత్యనారయణ, రాపోలు సత్తయ్య, యాదయ్య, సత్యనారయణగౌడ్, అంజయ్యగౌడ్, సలేశ్వర్, బోయ రమేష్, గోపాల్, సాయిమాలిక్, సిద్దేశ్వర్, యాదమ్మ, బిక్షపతి, ధర్మారెడ్డి, మహేష్, ముజమిల్, నాయీమ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.