సైదాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ల కాన్వాయ్ను అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం సైదాబాద్లోని ప్రభుత్వ బాలుర సదనం ప్రారంభోత్సవానికి విచ్చేసి తిరిగి వెళ్తున్న మంత్రుల కాన్వాయ్ను సైదాబాద్ మదీనా మెడికల్ హాల్ చౌరస్తా వద్ద బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.
దీంతో మంత్రుల భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు బీజేవైఎం కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారుపైకి ఎక్కి నిరసన తెలిపిన బీజేవైఎం నాయకుడు ఈశ్వర్ యాదవ్తోపాటు నిరసనలో పాల్గొన్న మరో నలుగురు శివ చంద్రగిరి, దినేశ్ గౌలికర్, భరత్, రాజేశ్లపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.