వెంగళరావునగర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. స్వచ్చ హైదరాబాద్-స్వచ్చ జూబ్లీహిల్స్ కార్యక్రమంలో భాగంగా గురవారం కృష్ణకాంత్ పార్కు వద్ద యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిల్-19కు మంజూరైన స్వచ్చ ఆటోలను ఆకుపచ్చ జెండాను ఊపి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ నియోజవర్గంలోని పరిసరాల్లో ఎక్కడా చెత్తా చెదారం కనిపించకూడదనే లక్ష్యంతోనే ఈ స్వచ్చ ఆటోలను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇంటితో పాటు..వీధులను పరిశుభ్రంగా ఉంచకోగలిగితే వ్యాధులు దరిచేరవని..మనతో పాటు సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్కుమార్ పటేల్, సి.ఎన్.రెడ్డి, జీహెచ్ఎంసి అధికారులు బిందుభార్గవి, విజయ్ కుమార్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.