శంషాబాద్ రూరల్: గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ, మల్కారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కలిసి ఆయన చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలతో పాటు కార్యకర్తలే కీలకమని వివరించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు గ్రామస్థాయిలో అందుతున్న తీరును తెలుసుకొని అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు, నాయకుల కృషితోనే పార్టీ గ్రామీణస్థాయి నుంచి బలోపేతంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసుతన్న దళితబంధు పథకాన్ని విసృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, యాదగిరిరెడ్డి, నీరటి రాజు, శ్రీశైలంలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నూతన గ్రామ కమిటీలు ఇవే
చిన్నగోల్కొండ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సార జంగయ్యగౌడ్, ఉపాధ్యాక్షలుగా యాదయ్య, కృష్ణగౌడ్, ప్రధాన కార్యదర్శిగా సాయిగౌడ్, కోశాధికారిగా కరుణాకర్రెడ్డిలతో పాటు పలువురు నాయకులుతో కమిటీ ని ఎన్నుకున్నారు. మల్కారం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యాక్షులుగా కుమార్, వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా ఆశోక్లతో పాటు పలువురు నాయకులతో నూతన కమిటీని ఏర్పాటు చేశామని మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు.