అమీర్పేట్: బోనాల వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రభుత్వం ద్వారా అందిన చేయూత మరువలేనిదని టెంపుల్ ప్రొఫెషనల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిబాబా చారి అన్నారు. గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాప్యాదవ్ను ఆయన నివాసంలో కలిసి వేడుకలు విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరపున ఏర్పాట్లు కల్పించే విషయంలో మంత్రి తలసాని విశేష చొరవ తీసుకోవడం పట్ల అసోసియేషన్ తరపున కలిసి జ్ఞాపికను అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేషచారి, కుమ్మరి ప్రసాద్, శివశంకర్, యాదగిరి చారి తదితరులు పాల్గొన్నారు.