వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. వికారాబాద్ పట్టణంలోని అనంత పద్మనాభస్వామి, వేంకటేశ్వరస్వామి, బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయాలతో పాటు ప్రసిద్దిగాంచిన ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనదని, ఆ రోజు పూజలు చేస్తే సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. స్వామివారి నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. ఆలయానికి వచ్చే భక్తులకు పూజారులు ఉత్తర ద్వారాలు తెరిచారు. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో అర్చకులు గోదాదేవి కల్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ దంపతులు ఆలయాల్లో పూజలు చేశారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట లక్ష్మీ వేంకటేశ్వస్వామి ఆలయంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, యాచారం మండలం మాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కిషన్రెడ్డి దంపతులు పూజలు చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్పటేల్ ఆలంపల్లి అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్నారు.