ముషీరాబాద్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భోలక్పూర్ భవానీ శంకర దేవాలయంలో గురువారం శివపార్వతుల కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల కోలాహలం, వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది.
అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మె ల్యే ముఠా గోపాల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆర్.శ్రీనివాస్, ఆలయ ఈఓ క్రిష్ణ, భోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, వంగాల నర్సింగరావు, సాయి, నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు.