భువనగిరి అర్బన్, ఏప్రిల్ 4 : తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళనలు నిరంతరం కొనసాగుతాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ధాన్యం కేంద్రం నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణలోని బాబు జగ్జీవన్రాం చౌరస్తాలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలిసే వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్ ముందస్తుగా రైతులకు సూచించారని తెలిపారు. బీజేపీ నాయకులు మాత్రం వరి వేయాలని రైతులను రెచ్చగొట్టారన్నారు. ధాన్యం కొనిపిస్తాం.. వరి వేయమని చెప్పిన నేతలు ఇప్పుడు కనిపించకుండా పోయారని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పంటలు కొనుగోలు చేయకుండా కాలక్షేపం చేస్తున్నదని విమర్శించారు. రైతులను మోసం చేసిన రాజ్యాన్ని కూల్చేదాకా వెనుకడుగు వేసేదే లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ కిరణ్కుమార్, జనగాం పాండు, నాయకులు శ్రీనివాస్రెడ్డి, ఓంప్రకాశ్గౌడ్, పంతులునాయక్, వెంకటేశ్వర్రావు, రాజేందర్రెడ్డి, బాలయ్య పాల్గొన్నారు.
బీబీనగర్ (భూదాన్పోచంపల్లి) : రైతులను నష్టపరుచాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. వడ్లను తామే కొంటాం.. వరి పండించాలని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని భావించిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను ముఖ్యమంత్రికి దూరం చేయాలని కుట్రలు చేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, సర్పంచ్ యాకరి రేణుకానర్సింగరావు, ఎంపీటీసీలు బచ్చు కిష్టయ్య, బత్తుల మాధవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, నాయకులు భూపాల్రెడ్డి, లింగంయాదవ్, మల్లారెడ్డి, శేఖర్రెడ్డి పాల్గొన్నారు.
బీబీనగర్ : ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, సర్పంచులు మంచాల రవికుమార్, మల్లగారి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ గోరుకంటి బాలచందర్, నాయకులు సుదర్శన్రెడ్డి, దేవేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
వలిగొండ : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి మాట్లాడుతూ పంజాబ్ తరహాలో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కునపురి కవిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, నాయకులు శ్రీనివాస్, భీమార్జున్రెడ్డి, పాండరి, లింగస్వామి, రత్నయ్య, రవీంద్ర, జనార్దన్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు
కేంద్రమే కొనుగోలు చేయాలి
సంస్థాన్ నారాయణపురం : రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకుంటే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ ఎలాంటి షరతులు లేకుంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే యాసంగిలో ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, సర్పంచులు శ్రీహరి, దోనూరి జైపాల్రెడ్డి, సుర్వి యాదయ్యగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, నాయకులు నలపరాజు రమేశ్, ఆడెపు సురేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
రామన్నపేట : మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, నాయకులు కంభంపాటి శ్రీనివాస్, పోచబోయిన మల్లేశం, సాయి, జగన్మోహన్, రమేశ్, శ్రీధర్రెడ్డి, అల్లయ్య, వెంకటేశం, రవి, మాధవరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అడ్డగూడూరు కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒకలా, గల్లీలో ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతీఅయోధ్య, సింగిల్ విండో చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, నాయకులు చిప్పలపల్లి మహేంద్రనాథ్, శ్రీరాముల అయోధ్య, పూలపల్లి జనార్దన్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.
మోత్కూరు యాసంగి వడ్లను కొనేదాకా కేంద్రంపై కొట్లాట చేస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మోత్కూరులో సోమవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ధాన్యం కొనకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు. పంజాబ్, తెలంగాణ రాష్ర్టాల్లో వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నదని, ఇది ద్వంద్వ నీతికి నిదర్శమని విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని విన్నవిస్తే కేంద్ర మంత్రులు అవహేళనగా మాట్లాడుతున్నారన్నారు. ఎఫ్సీఐ ఏర్పడినప్పటి నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారని, ఇప్పుడు కొర్రీలెందుకు పెడుతున్నదో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకూబ్రెడ్డి, వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు బొడ్డుపల్లి కళ్యాణ్చక్రవర్తి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కొండ సోంమల్లు, నార్మాక్స్ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు భాస్కర్రెడ్డి, సంతోష్రెడ్డి, శ్రీను, వెంకన్న, మల్లేశం పాల్గొన్నారు.