ఎల్బీనగర్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సరూర్నగర్ పోలీసులు కనుగొన్నారు. సరూర్నగర్ పోలీసుల కథనం ప్రకారం కొత్తపేట పీవీటీ మార్కెట్ పక్క సందులో ఓ వృద్దుడు ( 55) కింద పడిపోయి మరణించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మరణించిన వృద్దుడి పక్కనే ఓ క్వార్టర్ బాటిల్ పడి ఉంది. మృతుడు ముక్కులోంచి, తల వెనుకభాగంలో గాయాలు కావడంతో రక్తం కారినట్లుగా తెలుస్తోంది. సదరు వృద్దుడు మద్యం మత్తులో కింధ పడిపోయి గాయాలతో మరణించాడా లేక మరేదైనా సంఘటన చోటు చేసుకున్నదా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నాడు.
మృతుడి వంటిపై తెలుపు, నలుపు చారల ప్యాంటు, పసుపు, ఆకుపచ్చ రంగు చుక్కలు ఉన్న షర్టు, ఆకుపచ్చ రంగు మొలతాడు ఉంది. శవాన్ని పోస్టు మార్టుం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు సరూర్నగర్ పోలీసులకు ఫోన్ నెంబర్ 9094617170 లో సమాచారం ఇవ్వాలని కోరారు.