మూసాపేట, జనవరి 19 : రాష్ట్రంలోని సబ్బండ వ ర్ణాల అభ్యున్నతే ధ్యేయమని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జనరంజక పాలన అందుతున్నదని చెప్పారు. బుధవారం అడ్డాకుల మండలం కందూరు అనుబంధ గ్రామమైన వడ్డేపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్బెడ్రూం ఇండ్లను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మంత్రి శ్రీ నివాస్గౌడ్ ప్రారంభించారు. కొత్త ఇండ్లల్లో లబ్ధిదారు లు పాలు పొంగించారు. లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరిసింది. లబ్ధిదారులకు మంత్రులు మిఠాయిలు తినిపించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడు తూ దేశంలో 70 ఏండ్ల పాలనలో మన ప్రాంతం కుం టుబడిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కు టుంబానికి, ప్రతి వీధికి, ప్రతి గ్రామానికి, పట్టణానికి సర్కార్ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పల్లెలు స్వ చ్ఛత బాటలో పయనిస్తున్నాయని చెప్పారు. అందుకే యావత్ దేశం మన పాలనను ప్రశంసిస్తున్నదని తెలిపారు. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణంతో గూడులేని పే దలకు సొంతింటి కల నెరవేరుతున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతున్నా.. ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. అభివృద్ధితో పార్టీలకతీతంగా కలిసిరావాలని పిలుపునిచ్చా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పథకాలతో ల బ్ధిపొందుతున్న ప్రతి కుటుంబం సీఎం కేసీఆర్ను గుం డెల్లో పెట్టుకొని దీవించాలని కోరారు. ఎన్నికల కోసమే రాజకీయం చేస్తున్న పార్టీల మాటలు నమ్మొద్దని సూ చించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు మంత్రులు, ఎమ్మెల్యే బృందానికి అడ్డాకుల జెడ్పీటీసీ రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
జానంపేటలో..
మూసాపేట మండలం జానంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన 80 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆ ల వెంకటేశ్వర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అలాగే పాఠశాలలో అదనపు తరగతి గదుల కు ప్రారంభోత్సవం చేశారు. చిన్నారులు కోలాటాలు, మహిళలు బొడ్డెమ్మలు వేయగా.. బాజాభజంత్రీల మ ధ్య మంత్రులకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమా ల్లో రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జెడ్పీటీసీ ఇంద్రయ్య సా గర్, ఎంపీపీ గూపని కళావతి కొండయ్య, టీఆర్ఎస్ మండల పార్టీల అధ్యక్షులు తోకల శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనరసింహ యాదవ్, వైస్ ఎంపీపీలు రాధిక, రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్లు జితేందర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, సర్పంచులు శ్రీకాంత్, శ్రీనివాసులు, ఎంపీటీసీలు శ్యామలమ్మ, నక్క ఆంజనేయులు, తాసిల్దార్ కిషన్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.