చిక్కడపల్లి :ధర్మ పరిరక్షణ కేంద్రాలుగా దేవాలయాలు నిలుస్తాయని శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాదీశ్వరులు శ్రీమదభినవోద్ధండ విద్యా శంకర భారతీస్వామి అన్నారు. చిక్కడపల్లి వివేక్నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా శంకర భారతీస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందని సూచించారు. ఆత్మ సంతృప్తితో జీవించాలని ఆయన ప్రజలకు సూచించారు. దేవాలయాలను పునర్నిర్మించడం సంతోషాదాయకం అన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. యాదాద్రి దేవాలయానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభిచిందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఆలయ చైర్మన్ గుండెపూడి మురళీ ప్రసాద్, కార్యనిర్వాహణ అధికారి మాచర్ల దేవనాథం పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్కుమార్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమీషనర్ ఎం.రామకృష్ణారావు, డిప్యూటి ఇంజనీర్ పాండురంగ విఠల్, ఏఈ బాలయ్య, పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ, దాతలు దేవాలయం మాజీ ధర్మకర్త జానకి సుధాకర్, సినీ ఆర్టిస్టు డాక్టర్ సి.వెంకట గోవిందరావు, డాక్టర్ టి.రామకృష్ణ, ధర్మకర్తలు డాక్టర్ జి.కె.రమణ, ముసునూరి భాస్కర్, మురికి గణేశ్, జ్యోతి ప్రభుషా, గంట్యాల ప్రభాకర్, ఎం.వెంకటరమణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.