గోల్నాక : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడెండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
ఆదివారం అంబర్పేట త్రిశూల్ ఫంక్షన్ హాల్లో అంబర్పేట డివిజన్ కార్పొరేటర్గా ఇ.విజయ్కుమార్గౌడ్ ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్తో కలసి ఆయన హాజరై… విజయ్కుమార్గౌడ్ను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసి ప్రజల ఆశీస్సులు అడిగే పార్టీ కేవలం టీఆర్ఎస్ యే అని అన్నారు. అందుకే ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ..పార్టీ అభివృద్ధికోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.