సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు పేద తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నదని పద్మారావుగౌడ్ కొనియాడారు.
మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని బౌద్ధనగర్ డివిజన్లో వారాసిగూడ, ఈశ్వరిబాయి నగర్, పార్శిగుట్ట, సంజీవపురం, మహ్మద్గూడ, అంబర్నగర్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన 60 మందికి సుమారు 63లక్షల విలువచేసే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్తో పాటు ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ఆడబిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కంది నారాయణ, కిషోర్గౌడ్, కిరణ్కుమార్ గౌడ్, రామేశ్వర్తో పాటు పలు విభాగాలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.