అమీర్పేట్ : తలసాని యువసేన క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుండి ప్రారంభం కానుంది. టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నాయకుడు సచిన్ రాథోడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నమెంట్ విశేషాలతో కూడిన వాల్పోస్టర్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలతో కలిసి పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎం.హనుమంత రావు, కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.