హఫీజ్పేట్: ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆహ్లదకరమైన వాతావరణంలో పచ్చని అందాలమధ్య స్వచ్ఛమైన గాలిపీలుస్తూ కసరత్తులు చేసేలా ఏర్పాటుచేసిన ఓపెన్జిమ్ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. సోమవారం హఫీజ్ఫేట్ డివిజన్ జయశంకర్పార్కులో నూతనంగా ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్, కమాన్ (ఆర్చ్)ను కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్తోకలిసి ప్రారంభించారు.
అనంతరం హరితహరం కార్యక్రమంలోబాగంగా కాలనీవాసులు, వాకర్స్అసోసియషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ…ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పచ్చని అందాలమధ్య కసరత్తులు చేసుకొనేలా ఓపెన్జిమ్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. వేలల్లో వెచ్చించి దేహదారుఢ్యాన్ని మలుచుకొనే పరిస్ధితికి దూరంగా రూపాయి ఖర్చులేకుండా పచ్చని ఆహ్లదకరవాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ అత్యాధునిక వసతులతోకూడిన ఓపెన్జిమ్లను జీహెచ్ఎంసీ అధ్వర్యంలో నియోజకవర్గవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నా మన్నారు. అందులోబాగంగానే అత్యాధునిక వసతులతోకూడిన ఓపెన్జిమ్ను డాకాలనీ జయశంకర్పార్కులో అందుబాటులోకి తెచ్చామన్నారు. మహిళలు, చిన్నా, పెద్ద అనేతేడాలేకుండా అన్నివయసులవారు వినియోగించుకోవాలన్నారు.
కార్పొరేటర్ పూజితగౌడ్ మాట్లాడుతూ… రాళ్లురప్పలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని లక్షలు వెచ్చించి పచ్చదనం వెల్లివిరిసేలా చేయడమేగాకుండా ప్రస్తుతం అదనపు హంగులతో ఓపెన్జిమ్ ఏర్పాటుచేయడం ఎమ్మెల్యే చొరవతోనే సాధ్యమైందని అందుకు డివిజన్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు బాల్లింగ్ గౌతంగౌడ్, గౌరవాధ్యక్షుడు వాలా హరీష్, లకా్ష్మారెడ్డి, సాయిబాబా, మనోహర్గౌడ్, శ్రీనివాస్, రవికుమార్, చంద్రశేఖర్, రాజేశ్వర్గౌడ్, మోసినుద్దీన్, నాగేశ్వరరావు, ప్రభాకర్రావు, ప్రసాద్, నారాయణరెడ్డి, జ్ఞానేశ్వర్, బాలసుబ్బయ్య, భగత్, శ్రీను, బానుప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.