కరోనా, ఒమిక్రాన్ కట్టడికి సర్కార్ నడుంబిగించింది. వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం సమాయత్తమైంది. శుక్రవారం నుంచి ఆరోగ్య సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం సన్నద్ధమైది. వైద్య, ఆశ, అంగన్వాడీ, మున్సిపల్, పంచాయతీ,రెవెన్యూ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో ఈ సర్వే చేపట్టనున్నది. ఈ బృందం గ్రామాల్లో పర్యటించి నిత్యం 25 కుటుంబాల్లోని ప్రతిఒక్కరి ఆరోగ్య వివరాలను సేకరించనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలుంటే మందులు అందించనున్నారు. ఎవరికైనాపాజిటివ్ లక్షణాలు ఉంటే హోం ఐసొలేషన్ కిట్లను పంపిణీ చేయడంతోపాటు జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. మొదటి డోస్ 100శాతం పూర్తవగా.. ఈ నెలాఖరు నాటికి రెండో డోసు కూడా వంద శాతం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.
నాగర్కర్నూల్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : కరో నా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించనున్నారు. ఆశ, అంగన్వాడీ, పంచాయ తీ, మున్సిపల్, రెవెన్యూ ఉద్యోగులతో కూడిన బృందం గ్రామాల్లో పర్యటించనున్నది. ప్రతిరోజూ దాదాపుగా 25 కుటుంబాలకు సంబంధించిన వారి ఆరోగ్యాల వివరాలను పరిశీలించాలని వైద్యఆరోగ్య శాఖ నిర్దేశించింది. కుటుంబ సభ్యులను పూర్తిగా పరిశీలించి వివరాలు నమోదు చేయనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శరీరం, గొంతు నొప్పు లు వంటి లక్షణాలుంటే మాత్రలు ఇవ్వనున్నారు. కొవిడ్ లక్షణాలుంటే పారాసిటమాల్, సిట్రోజన్, సీ విటమిన్లతో కూడిన హోం ఐసొలేషన్ కిట్లను అందజేసి, ఎలాంటి జా గ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. 2020లో కూడా ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టడంతో కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గింది. ఆరోగ్యం విషమించకముం దే మందులు అందజేశారు. దవాఖానల్లో చేరే వారి సంఖ్య కూడా తగ్గింది. ఎక్కువ మంది కొవిడ్కు గురైతే చికిత్స అందించడం కూడా కష్టం. ఈ ఏడాది కూడా ఆరోగ్య సర్వే కు ప్రభుత్వం సమాయాత్తమైంది. కరోనా మూడో దశలో భాగంగా కొవిడ్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజ లు భౌతికదూరం, శానిటేషన్, మాస్కులు మర్చిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కాగా, ప్రభుత్వం వయోజనులతోపాటు టీనేజర్లకు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులకు, ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్లు, బూస్టర్ డోసులను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. తొలిడోసు వంద శాతం పూర్తయ్యింది. రెండో డోసును కూడా ఈ నెలాఖరుకు వంద శా తం పూర్తి చేసేలా అధికార యంత్రాంగం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ జిల్లా, ఏరియా, సివిల్, పీహెచ్సీల్లో కొవిడ్ కోసం ఓపీ సేవలను కూడా అందించనున్నారు. ప్రతి దవాఖానలో కొవిడ్ టెస్టిం గ్, హోం ఐసొలేషన్ కిట్లు, మందుల నిల్వలు సిద్ధంగా ఉంచింది. ఇక కొవిడ్ రోగులకు పౌష్టికాహారం అందించనున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.200 భోజన ఛార్జీలుగా ప్రభుత్వం చెల్లించనున్నది. గ్రామానికో నోడల్ అధికారిని నియమించనున్నారు. జిల్లాలో త్వరలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బందిని అం దుబాటులో ఉంచనున్నారు. మొత్తమ్మీద కరోనా ని యంత్రణకు ప్రభుత్వ ఆదేశాతో వైద్యఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో తొలిడోసును 6,48,737 మంది.. రెండో డోసు ను 4,35,831 మంది తీసుకున్నారు. ఇక 15 నుంచి 18 ఏండ్లున్న టీనేజర్లు 18,84 4 మంది టీకా వేసుకోగా.. 1,902 మం ది బూస్టర్ డోస్ తీసుకున్నారు.
కొవిడ్ నియంత్రణకు చర్యలు..
కొవిడ్ నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటాం. ఉయ్యాలవాడ, తాడూరులో కొవిడ్ కేర్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారంలో దాదాపు 600 మందికి కరోనా వచ్చింది. శుక్రవారం నుంచి 870 బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహిస్తాం. కొవిడ్ లక్షణాలుంటే హోం ఐసొలేషన్ కిట్లు అందజేస్తాం. ఐదు రోజుల్లోనే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతకంటే ఎక్కువ రోజులుగా దగ్గు, జ్వరం ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.