రేవల్లి/కల్వకుర్తి రూరల్, జనవరి 20 : నాలుగేండ్లుగా ఇష్టపడ్డ తమ ప్రేమను కుటుంబ స భ్యులు అంగీకరించడం లేదని మనస్తాపం చెంది న బావామరదళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన వ నపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరిదేవిపల్లి వద్ద చో టు చేసుకున్నది. రేవల్లి ఎస్సై శ్రీనివాసులు కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్కుమార్ (27)కు ఆరేండ్ల కిందట మౌనికతో వివాహం జరిగింది. వీరికి 3 నెలల పాప ఉన్నది. అయితే నరేశ్కు మరదలు వరుస అయ్యే కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన దండోత్కర్ మల్లేశ్ కుమార్తె కళ్యాణి (18) నాగర్కర్నూల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య నాలుగేండ్లుగా సాన్ని హిత్యం పెరిగింది. ఈ విషయాన్ని కుటుంబ స భ్యులకు ఇరువురు తెలియజేయగా అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ ఈనెల 13న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన కళ్యాణి తిరిగి ఇంటికి వెళ్లలేదు. బంధువులు, తెలిసిన వారి ఇండ్లల్లో వెతికినా ఆచూకీ ల భ్యం కాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు 18న కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా గురువారం ఉదయం ఇద్దరూ గౌరిదేవిపల్లి సమీపంలోని ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-3 వద్దకు కాలినడకన చేరుకున్నారు. వారి ప్రేమను అంగీకరించడం లేద ని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. చావుకు వారి తల్లిదండ్రులే కారణమ ని ఫోన్లో, సూసైడ్ లెటర్ రాసి రిజర్వాయర్లో దూకారు. గుర్తించిన స్థానికులు పోలీసులకు స మాచారం అందించారు. రేవల్లి ఎస్సై శ్రీనివాస్, తాసిల్దార్ శ్రీరాములు ఘటనా స్థలానికి చేరుకొని రిజర్వాయర్ పంపింగ్ మోటర్లను ఆఫ్ చేయించా రు. ఫైర్ సిబ్బంది సాయంతో రాత్రి వరకు మృతదేహాల కోసం గాలించారు. అయినా లభ్యం కాలేదు.