ఎల్బీనగర్ : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శ్రీకాంతచారి వర్థంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్చార్జీ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి సేవలను ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆసువులు భాసిన అమరులందరికీ యావత్ తెలంగాణ జోహార్లు అర్పిస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా అమరవీరుడు శ్రీకాంతచారి విగ్రహానికి చైతన్యపురి మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు త్రివేది, పవన్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.