గద్వాల, జనవరి 17 : ఆర్టీసీలో సరుకులు, పార్సిల్ రవా ణా కోసం ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్పై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నది. ఇతర కొరియర్ సర్వీస్ల కంటే వే గంగా సేవలందుతుండడంతో కార్గో సర్వీస్ను బుక్ చేసుకునే వారి సంఖ్య అధికమవుతున్నది. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తుండడంతోపా టు ఆదాయం సమకూరుతున్నది. పార్సిల్ రవాణాలో కచ్చితత్వం పాటిస్తుండడంతోపాటు ఇత ర సర్వీసుల కంటే తక్కువ ధరకే సేవలందుతున్నాయి. కార్గో సేవలు ప్రవేశపెట్టిన మొదటి రోజుల్లో సరుకులు మాత్రమే రవాణా చేసేవారు. ప్రస్తుతం రైతులకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు, సిమెంట్, బియ్యం బస్తాలు, పంటను మార్కెట్కు తరలించడం వంటివి కూడా ప్రారంభించారు.
రోజుకు సరాసరి 90 బుకింగ్స్..
గద్వాల బస్టాండ్లో ఏర్పాటు చేసిన కార్గో సర్వీస్కు నిత్యం సరాసరి 90 బుకింగ్స్ వస్తున్నాయి. ఒక్కో బస్లో 10 టన్నుల వరకు సరుకులు రవాణా చేస్తున్నారు. గద్వాల, అయిజ, శాంతినగర్, అలంపూర్ చౌరస్తా, ఎర్రవల్లి, కర్నూల్, నంద్యాల, హైదరాబాద్కు కూడా సేవలందిస్తున్నారు. నిత్యం రూ.11 వేల ఆ దాయం సమకూరుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబా ద్ నుంచి గద్వాలకు నెలలో సుమారు 150 నుంచి 200 వరకు పార్సిళ్లు వస్తున్నాయి. దీంతో డిపోకు నెలకు రూ.3.30 లక్షల ఆ దాయం వస్తున్నది. సరుకు బరువు, దూరాన్ని బట్టి చార్జీలు వ సూలు చేస్తున్నారు. గతేడాది పాఠశాలలకు ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్య పుస్తకాలను కూడా తరలించారు. రైతులకు అవసరమైన దాణాను ఫ్యాక్టరీ నుంచి సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా కార్గో సేవలు ఉపయోగిస్తున్నారు.
సురక్షితంగా చేరవేస్తున్నాం..
కార్గో సర్వీస్కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. నిషేదిత వస్తువులు తప్పా అన్ని రవాణా చేస్తాం. కార్గో సర్వీస్తో సరుకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. వినియోగదారుల వస్తువులను ఇతర డిపోలోని ఆర్టీసీ అధికారులకు లెక్క చూపిస్తాం. సర్వీస్ వేగంగా ఉంటుంది. నెలకు కార్గో ద్వారా డిపోకు సుమారు రూ.3.30 లక్షల ఆదాయం సమకూరుతున్నది. 10 టన్నుల వరకు రవాణా చేస్తాం.