ఖైరతాబాద్ : రాష్ట్రంలోని దళితలందరూ ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిందించాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తాలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాధీముభారక్ చెక్కులను కార్పొరేటర్ వనం సంగీత యాదవ్తో కలిసి పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ పేదింట్ల కల్యాణకాంతులు నింపేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాధీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇంటి పెద్దగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది మందికి లబ్ధి చేకూరిందని, నియోజకవర్గంలో కొవిడ్ సమయంలోనూ ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేశామన్నారు.
రాబోవు రోజుల్లో దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించి డివిజన్కు 15 మంది చొప్పున ఎంపిక చేసి వారికి ఆ నిధులను అందిస్తామన్నారు. ఆర్థిక స్థోమత లేని వారి కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించామని, ఇప్పటికే సర్వే ప్రారంభించామని తెలిపారు.
ముఖ్యమంత్రి మంచి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని, అర్హులైన ప్రతి కుటుంబానికి అందాలన్నది ఆయన ఆలోచన అని, దానికి అనుగుణంగా దళితబందు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి, పేద ప్రజలకు అండగా నిలుస్తామన్నారు.
టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మినారాయణమ్మ, డివిజన్ అధ్యక్షులు ఎస్కె అహ్మద్, ఖుర్షిద్, సలావుద్దీన్, ఫేరోజ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.