ఆర్కేపురం : సరూర్నగర్ పట్టణంలోని శ్రీ బంగారు మైసమ్మ శ్రీ కాశీ వైద్యనాదేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం దేవాలయం ధర్మకర్తల మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ టూరిజమ్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధాధీరజ్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ, నాయకులు కొత్త మనోహర్రెడ్డి, దేప భాస్కర్రెడ్డి, శివప్రసాద్, ధన్రాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.