ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుతో ప్రజలకు పోలీసులు చేరువయ్యారని, ఈ విధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్లో పోలీస్ సిబ్బంది క్వార్టర్స్, బ్యారక్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి కుంటు పడుతుందని, నక్సలైట్లు పెరుగుతారని చాలామంది భావించారన్నారు. కానీ, సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను బలోపేతం చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టం చేశారన్నారు. పోలీసు సిబ్బందికి అధునాతన వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
మర్కూక్, అక్టోబర్ 16: రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుతో ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని, ఈ విధానంతో సత్ఫలితాలు వస్తున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్లో నిర్మించిన పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ను శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే అభివృద్ధి కుంటు పడుతుందని, నక్సలైట్లు పెరుగుతారని చాలామంది భావించారన్నారు. దాన్ని తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ పోలీస్శాఖకు బలోపేతం చేసి రాష్ట్రంలో శాంతిభద్రత లు పటిష్టం చేశారన్నారు. పోలీసు సిబ్బందికి అధునాతన వాహనాలు సమకూర్చడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. డయల్ 100 కాల్ చేయగానే పోలీస్లు నిమిషాల్లో సంఘటనా స్థలానికి భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్శాఖ ఆధునిక టెక్నాలజీ ని ఉపయోగించి కేసులు త్వరితగతిన ఛేదిస్తున్నదని, నేరస్తుల ఆట కట్టిస్తున్నదన్నారు. మర్కూక్లో పోలీస్ సిబ్బంది కోసం రూ.3కోట్లతో విశాంత్రి భవనాలు నిర్మించినట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పోలీస్ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ సీఎం కేసీఆర్ కల్పించారన్నారు. దసరా పండుగ రోజున పోలీస్ సిబ్బంది విశాంత్రి భవనం, డైనింగ్ హాల్ ప్రారభించడం సంతోషంగా ఉందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుచేస్తూ ప్రజలకు పోలీసులు చేరువైనట్లు తెలిపారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ ఐజీ శివశంకర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్పీ రెమా రాజేశ్వరి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్, ఎంపీపీ పాండు, జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి, సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీ సాయిరెడ్డి చైతన్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజినీర్ విజయ్కుమార్, ఈఈ శ్రీనివాస్రావు, డీఈ రా జయ్య, ఏసీపీ రమేశ్, ఎస్సైలు శ్రీశైలం, కృష్ణ, సంపత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.