ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 4,81,023 మందికి టీకా
జిల్లా మొత్తం
సిద్దిపేట 11,252
సంగారెడ్డి 17,965
మెదక్ 25,284
సిద్దిపేట సెప్టెంబర్ 16 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నది. మొదటి విడుతలో 4,81,023 మందికి వ్యాక్సిన్ వేశారు. గురువారం నుంచి రెండో దశ టీకా వేసే కార్యక్రమం జిల్లాలోప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు, 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,81023 మందికి కొవిడ్ టీకా వేశారు. మొదటి డోస్ వేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 7550 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 6216 మంది, మొత్తంగా 13766 మంది, ఫ్రంట్లైన్ వర్కర్లు మొదటి డోస్ వేసుకున్న వారు 9008 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 6019 మంది, మొత్తంగా 15027 మంది, 60 ఏండ్లు తక్కువ వయస్సు కలిగిన వారిలో మొదటి డోస్ వేసుకున్న వారు 90865 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 50216 మంది, మొత్తంగా 1,41,081 మంది, 45 నుంచి 59 ఏండ్లు కలిగిన వారిలో మొదటి డోస్ వేసుకున్న వారిలో 1,22,693 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 66,013 మంది మొత్తం 1,88,706 మంది, 18 నుంచి 44 సంత్సరాల వయస్సు ఉన్నవారు 1,12,127 మంది, రెండో డోస్ వేసుక్ను వారు. 10316 మంది మొ త్తంగా 1,22,443 మంది టీకా తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం మొదటి డోస్ వేసుకున్న వారు 3,42,243 మంది, రెండో డోస్ వేసుకున్న వారు 1,38,780 మంది, మొత్తంగా 4,81,023 మంది టీకా వేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం రెండో దశ వ్యాక్సినేషన్ గురువారం నుంచి ప్రారంభించింది.
ఇంటింటా సర్వే
జిల్లాలో వ్యాక్సిన్ వేసుకొని వారిని గుర్తించి పంచాయతీల వారీగా టీకా వేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు 5,83,809 మంది ఉండగా, వీరిలో 2,03,445 మందికి రెండో డోస్ వేయాల్సి ఉంది. 2,41556 మంది మొదటి డోస్ టీకా వేయాల్సి ఉంది. జిల్లాలో 194 ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పరిధిలో టీకా వేసుకొని వారిని గుర్తించేందుకు 194 టీంలతో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించనున్నారు. ప్రతిరోజూ 10వేల నుంచి 15వేల మందికి టీకా ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
సంగారెడ్డి పట్టణం అంబేద్కర్ భవనంలో వ్యాక్సిన్ టీసుకుంటున్న మహిళ
సంగారెడ్డి మున్సిపాలిటీ, సెప్టెంబర్ 16 : ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచిస్తున్నారు. ప్రభు త్వం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను గురువారం ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో వ్యాక్సిన్ వేసే ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో 246 సబ్ సెం టర్లు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీ సబ్ సెంటర్లో 4 నుంచి 5 గ్రామాల ప్రజలకు వ్యాక్సిన్ అందించనున్నారు. సం గారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో 38 వార్డులు, సదాశివపేట 28 వార్డులు, పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్లో 24 వార్డులు, తెల్లాపూర్లో 20 వార్డులు, బొల్లారంలో 22 వార్డులు, జహీరాబాద్లో మున్సిపాలిటీలో 37 వార్డులు, అందోల్-జోగిపేటలో 20 వార్డులు ఉన్నా యి. జిల్లాలో మొత్తం 17, 50,000 మంది జనాభా ఉన్నారు. ఇందులో వ్యాక్సిన్కు అర్హులైన వారు 14,50,000 ఉన్నారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకున్న వారు 5,75,444 మం ది. ఇందులో 60 ఏండ్ల వయస్సు పైబడిన వారు 69,353 వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏండ్లు వయస్సు పైబడిన వారు 1,99,112 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా, 18 ఏండ్లు వయస్సు పైబడిన వారు 2,77,187 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. జిల్లాలో 8,60,000 మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉన్నది. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారభించింది. వ్యాక్సిన్కు సంబంధించిన సర్వే కూడా నిర్వహించనున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు.
మెదక్ జిల్లాలో
2.04 లక్షల మందికి మొదటి డోస్
75,545 మందికి రెండో డోస్
మెదక్, సెప్టెంబర్ 16 : కొవిడ్ వ్యాక్సినేషన్పై గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. టీకా వేసుకోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో మొదటి, రెండో డోస్ కలిపి మొత్తం 2,80,502 మంది వేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో కొంత ఊరట కలిగిస్తున్నది. వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవడంతో పాటు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
మెదక్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టింది. ఒక వైపు కరోనా నిర్ధారణ కోసం రాపిడ్ యాంటిజన్(ఆర్ఏటీ) పరీక్షలు అధికంగా చేస్తూ వైరస్ సోకిన వారిని గుర్తించి, హోం ఐసొలేషన్లో ఉంచుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ను అర్హులందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. దీంతో జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. జిల్లాలో నిర్వహించిన ఇంటింటి ఆరోగ్య సర్వే ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ వారు తీసుకున్న చర్యలు కరోనా కట్టడికి తోడ్పడ్డాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్, మే నెలలో కరోనా సెకండ్ వేవ్ జిల్లాలో ప్రజల ప్రాణాలను బలితీసుకున్నది. చాలా గ్రామాల్లో కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఇదిలావుండగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో కరోనా తీవ్రత చాలా తగ్గింది.
మెదక్ జిల్లాలో 2,80,502 మందికి టీకా..
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ముందుగా హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తర్వాత మార్చి ఒకటో తేదీ నుంచి 45 ఏండ్ల పైబడిన వారికి, ఆ తర్వాత 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. జిల్లాలో 7 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు 2,80,502 మందికి వ్యాక్సినేషన్ వేయగా, వారిలో 2లక్షల 4వేల967 మందికి మొదటి డోస్, 75వేల 545 మందికి రెండో డోస్ తీసుకున్నారు. జిల్లా దవాఖానతో పాటు 20 పీహెచ్సీల్లో కొవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే బుధ, ఆదివారాల్లో మినహాయించి వారంలో ఐదు రోజుల పాటు వ్యాక్సిన్ వేస్తున్నారు. పల్లెల్లో వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించడంతో అన్ని వయస్సుల వారు ముందుకు వస్తున్నారు.
ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యాధికారులు…
వ్యాక్సిన్ తీసుకున్న వారు, తీసుకొని వారు కొవిడ్ నిబంధనలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పకుండా మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలని అంటున్నారు. పెళ్లిలు, శుభకార్యాలు, ఇతర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమ్తతంగా ఉంటూ టీకాలు వేయించుకుంటే కరోనాను అధిగమిస్తామని చెబుతున్నారు.
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి
ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 5,75,444 మందికి వ్యాక్సిన్ అందించాం. జిల్లాలో 8,60,000 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. ఇందుకోసం స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారభించాం. జిల్లాలోని అన్ని గ్రామాల్లోని పీహెచ్సీ సబ్ సెంటర్లు, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, జోగిపేట మున్సిపాలిటీలు, పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు వ్యాక్సిన్ అందించనున్నాం. ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైద్యాధికారులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ అధికారులు, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది భాగస్వాములు కానున్నారు. 18 వయస్సు పైబడిన వారితోపాటు అన్ని వయస్సుల వారు వ్యాక్సిన్ తీసుకుని రక్షణ పొందాలి.
సజావుగా వ్యాక్సినేషన్
మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నది. అర్హులందరూ టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలి. పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పంపిణీ కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 2,80లక్షల మందికి టీకాలు వేశాం. ఇక నుంచి టీకా పంపిణీ ప్రక్రియ వేగవంతం చేస్తాం. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, మెదక్