ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2741 మంది హాజరు
కేంద్రాలను సందర్శించిన అధికారులు
24 పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1012 మంది విద్యార్థులు గైర్హాజరు
వర్గల్ నవోదయ విద్యాలయ సమితి ప్రిన్సిపాల్ వెంకటరమణ
వర్గల్/ మిరుదొడ్డి/ మెదక్ అర్బన్/ హుస్నాబాద్/ నర్సాపూర్/ సిద్దిపేట అర్బన్, ఆగస్టు 11: వర్గల్ జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయ సమితిలో ఆరో తరగతి ప్రవేశం కోసం బుధవారం జరిగిన అర్హత పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగినట్లు వర్గల్ నవోదయ విద్యాలయ సమితి ప్రిన్సిపాల్ పి.వెంకటరమణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో (80 సీట్లు) పరిమిత సంఖ్యలో నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షకు సంగారెడ్డి జిల్లా నుంచి 1176 మంది, మెదక్ నుంచి 567 మంది, సిద్దిపేట జిల్లా నుంచి 998 విద్యార్థులు మొత్తం 2,741 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్షలు నిర్విహించగా దరఖాస్తు చేసుకున్న వారిలో వివిధ కారణాలతో 1012 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని బాలుర జడ్పీ పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 76 మంది విద్యార్థులకు గానూ 47 మంది హాజరయ్యారు. మెదక్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు పరీక్ష కేంద్రాల్లో 567 మంది విద్యార్థులకు గాను 336 మంది విద్యార్థులు హాజరై 231 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని మెదక్ జిల్లా విద్యాధికారి రమేశ్ కుమార్ తెలిపారు. మెదక్ పట్టణంలోని గీతా హైస్కూల్, ప్రభుత్వ ప్రాథమిక బాలుర పాఠశాల పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారి నీలకంఠంతో కలిసి సందర్శించారు. హుస్నాబాద్లోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో మొత్తం 173మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 120మంది విద్యార్థులు మాత్రమే హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్లు బండారి మనీలా, ఎస్.వెంకటయ్య తెలిపారు. బీఎల్వోగా రామవరం హైస్కూల్ హెచ్ఎం రమేశ్ వ్యవహరించారు. నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నవోదయ ప్రవేశపరీక్షకు 123 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 83 మంది హాజరైనట్లు స్థానిక ఎంఈవో బుచ్చానాయక్ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 63.2 హాజరు శాతం నమోదైంది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 1267 మంది విద్యార్థులకు గానూ 801 మంది విద్యార్థులు హాజరై, 466 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆదర్శ విద్యాలయం, దుబ్బాకలో 96 మందికి 77, జడ్పీహెచ్ మిరుదొడ్డి 76 మందికి 47, సెయింట్ మేరీ విద్యానికేతన్, ప్రజ్ఞాపూర్ 144 మందికి 86 మంది, జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్లో 106 మందికి 57, సిద్దిపేట పట్టణంలోని పారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 132 మందికి 77, సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 132 మందికి 89 మంది, సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో 132 మందికి 77 మంది, సిద్దిపేట పట్టణంలోని న్యూ గవర్నమెంట్ హైస్కూల్లో 84 మందికి 51 మంది, హుస్నాబాద్ పట్టణంలోని జడ్పీహెచ్లో 96 మందికి 61 మంది, హుస్నాబాద్ పట్టణంలోని జడ్పీహెచ్ బాలికల హైస్కూల్లో 77 మందికి 59 మంది, చేర్యాలలోని జడ్పీహెచ్ బాలికల హైస్కూల్లో 96 మందికి 51 మంది విద్యార్థులు నవోదయ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.