హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై హర్షం
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సంబురాలు
హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై హర్షం జిల్లాలో పలుచోట్ల సంబురాలు
సిద్దిపేట/ గజ్వేల్/ చేర్యాల/ బెజ్జంకి/ సంగారెడ్డి, ఆగస్టు 11: టీఆర్ఎస్లో ఉద్యమకారులకే సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తారని మరోసారి రుజువైందని, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్కు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంపై టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్ ఆధ్వర్యంలో, గజ్వేల్లో పట్టణాధ్యక్షుడు, ఏఎంసీ డైరెక్టర్ శీలసారం ఆధ్వర్యంలో బుధవారం పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు టికెట్ ఇవ్వడంపై సీఎం కేసీఆర్, పార్టీ ఎన్నికల ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, చేర్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలు యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమ నాయకుడిని పోటీలో దింపడంతోనే గులాబీ పార్టీ విజయం దాదాపు ఖాయమైందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో గెల్లు శ్రీనివాస్ను నిలుపడంపై సిద్దిపేట జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు ఏల శేఖర్బాబు హర్షం వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలో ప్రధాన రహదారిపై పటాకులు పేల్చి యువతకు అవకాశం ఇచ్చి గెలిచే నాయకత్వాన్ని బలపర్చుతున్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ నాయక్ స్వాగతించారు. సిద్దిపేట సంబురాల్లో నాయకులు రాచకొండ భిక్షపతి, మోకిళ్ల శ్రీకాంత్రెడ్డి, రాజు, విజయ్, స్వామి, పర్శరాములు, మధు, శ్రీను, రాజశేఖర్రెడ్డి, తిరుపతి, శ్రీకాంత్, రాజమల్లు, గజ్వేల్లో నిర్వహించిన సంబురాల్లో వైస్ ప్రెసిడెంట్ నర్సింహా, జనరల్ సెక్రటరీ నవాజ్, కన్నా యాదవ్, యాదగిరి, టౌన్ ప్రచార కార్యదర్శి వినయ్రెడ్డి, రాజు, మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. చేర్యాల సమావేశంలో టీఆర్ఎస్వీ మండల నాయకులు ఆకుల రాజేశ్గౌడ్, ఈరు పవన్, ఏషబోయిన నాగరాజు, ఉమకాంత్ పాల్గొన్నారు. సంగారెడ్డి కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీహరి, నాయకులు సందీప్, శ్రావణ్రెడ్డి, రాము, లక్ష్మణ్, రోషన్, దినేశ్ నాయక్, రాకేశ్, చిన్నా తదితరులు పాల్గొన్నారు.