శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో విదేశీ కరెన్సీ పట్టుబడింది. కాగా కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఏఐ-951 విమానంలో దుబాయ్ వెళ్లేందుకు ఇద్దరు ప్రయాణీకులు వచ్చారు.
వారిపై అనుమానం రావడంతో సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు.వారి బ్యాగుల్లో విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. వారివద్ద సౌదీ అరేబియా రియాల్ 88500, యుఏఇ ధరమ్స్ 2900 పట్టుబడ్డాయి. వాటి విలువ రూ .17.75 లక్షలు ఉంటుందని అంచనా. కరెన్సీ స్వాధీనం చేసుకొని వారిని కస్టమ్స్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.