ఆర్కేపురం : భారతదేశంలో మహిళలకు అక్షరభ్యాసం నేర్పి, మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సావిత్రీబాయిపూలే అని మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సరూర్నగర్ డివిజన్ డాక్టర్స్ కాలనీలో సావిత్రీబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హాజరై సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, బాలరాజు, సిలివేరు వెంకట్గౌడ్, మల్లేష్గౌడ్, దొబ్బు రాజు, మొగిళ్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
సరూర్నగర్…
సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను నేటి మహిళా లోకం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం జేబీ కాలనీలోని సావిత్రి బాయి పూలే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పారుపల్లి దయాకర్రెడ్డి, లోకసాని కొండల్రెడ్డి, బోయిని మహేందర్యాదవ్, సుదర్శన్ ముదిరాజ్, జంగారెడ్డి, శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.