సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 17 : స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాలు సమాజ సేవలో ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. మెస్సర్స్ పార్కర్ హన్నీఫిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో మెడ్వాన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో అమలుచేస్తున్న మోడల్ స్కూల్ ప్రాజెక్టును శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక వసతులను కల్పనకు కృషిచేస్తున్నదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో టెక్నాలజీ వినియోగించుకుంటూ విద్యార్థులు చదువుకునేలా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలోని ఆరుట్ల, పోచారం, ఐనో లు, రామేశ్వరం బండ పాఠశాలల్లో డిజిటల్ ఎడ్యుకేషన్కు అవసరమైన సామగ్రిని అందిస్తున్న పార్కర్ హనీఫ్ ఇండియా యాజమాన్యాన్ని, మెడ్వాన్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను దత్త తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
మోడల్ స్కూల్ ప్రాజెక్టులో భాగంగా ఆయా పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రొజెక్టర్ ద్వారా బోధిస్తారని మెడ్వాన్ సంస్థ అధ్యక్షుడు మోహన్రావు పేర్కొన్నారు. జాయ్ఫుల్ లెర్నింగ్ కిట్స్తో ప్రైమరీ స్కూల్ స్థాయి పిల్లలు చదువుకుంటారని చెప్పారు. నాలుగు పాఠశాలలకు ఒక్కో ప్రొజెక్టర్, మూడు చొప్పున జాయ్ఫుల్ లెర్నింగ్ కిట్స్, ప్రతి విద్యార్థికి టై, బెల్ట్, షూస్, సాక్స్, బుక్స్, బ్యాగ్స్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రానికి ఒక జాయ్ఫుల్ లెర్నింగ్ కిట్ల ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రా జర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, మహిళా శిశు సం క్షేమ శాఖ అధికారి పద్మావతి, పార్కర్ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీరామ్ వెంకట్ రామన్, మెడ్వాన్ సంస్థ కార్యదర్శి మధుసూదన్రెడ్డి, సీడీపీవోలు, ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.