పత్తి చేనులో పనులు చేస్తూ ఉపాధి
రోజుకు ఒక్కరికి రూ.400 కూలీ
కంది, ఆగస్టు 11: రాయలసీమలోని చిత్తూరు, కర్నూల్ జిల్లాలకు చెందిన పలువురు సంగారెడ్డి జిల్లా కంది ప్రాంతానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. రాయలసీమ నుంచి 50 వరకు కుటుంబాలు వలస వచ్చి సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని కాశీపూర్, జుల్కల్ గ్రామాల్లో వ్యవసాయ పనులు చేస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్తి చేనులో పనిచేస్తే వారికి ఒక్కొక్కరికి రూ.400 చొప్పున కూలీ అందిస్తున్నారు. తమ ఊర్లలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అక్కడ కుటుంబ పోషణ భారంగా మారిందని, అందుకే తెలంగాణకు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు వలస కుటుంబాలు తెలిపాయి. చిత్తూరు, కర్నూలు ప్రాంతాలకు చెందిన సుమారు 50 కుటుంబాలు తమ చంటి బిడ్డలతో సహా సంగారెడ్డి జిల్లాకు వలస కూలీలుగా వచ్చాయి. ఇక్కడ మూడు నెలల పాటు ఇక్కడ ఉండి పని చేసుకుని ఉపాధి పొంది తిరిగి తమ సొంతఊర్లకు పయమవుతామని చేనులో పని చేస్తున్న వలస కూలీలు తెలిపారు.