గోల్నాక : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న పలు ప్రధాన సమస్యలకు ప్రణాళికా బద్ధంగా మోక్షం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బుధవారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్ నుంచి సీపీఎల్ క్వార్టర్స్, ఆజాద్నగర్ వరకు రూ.40లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి, డ్రైనేజీ పైప్లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భవిష్యత్తులో కలుషిత మంచినీటి సరఫరా సమస్య తలెత్తకుండా పైప్లైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా డ్రైనేజీ పైప్లైన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు.
అనంతరం ప్రేమ్నగర్, ఆజాద్నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ఆయన స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. బస్తీల్లో పాడైన బోర్లకు మరమ్మతులు నిర్వహించి వినియోగంలోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. వెలగని వీధిదీపాలకు మరమ్మతులు, ఇనుప కరెంటు స్తంభాలకు బదులుగా సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు సతీష్, కుశాల్, జీహెచ్ఎంసీ అధికారులు శంకర్, సువర్ణ, దుర్గ, విద్యుత్ అధికారులు వెంకటరమణరెడ్డి, బస్తీవాసులు వెంకటేశ్, ఆసిఫ్, గిరి, రాజు, భాషా, నారాయణ,లక్ష్మి, స్వామి, యాదమ్మ, యాదగిరి, మోహిన్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్దార్థ్ముదిరాజ్, నాయకులు లింగారావు, సతీష్, రామారావు యాదవ్, జాకీబాబు, ప్రవీణ్పటేల్, మహేష్ముదిరాజ్, జాఫర్, గౌస్, సునీత, అరుణ, భవాని తదితరులు పాల్గొన్నారు.