బడంగ్పేట : ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రూ.4వేల కోట్లు కెటాయించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.20 కోట్లు, సాయి నగర్లో రూ.14లక్షలతో సీసీ రోడ్డు పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్స్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
కార్పొరేటర్ ఎర్ర మహేశ్వరి జైహింద్ విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా టై, బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ప్రాస్ట్రక్చర్ కోసం ప్రభుత్వం రూ.4వేల కోట్లు కెటాయిస్తూ క్యాబినెట్సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.
త్వరలోనే నిధులు వస్తాయన్నారు. జిల్లెలగూడ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు కల్పి రూ.85లక్షలు, శివరాం పల్లి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు రూ1.29 కోట్లు, హలియా ప్రైమరీ స్కూల్కు రూ.87లక్షలు, మహాబూ బియా ప్రైమరీ స్కూల్కు రూ.55లక్షలు ప్రభుత్వం కెటాయించిందన్నారు.
పాఠశాలలో ఇ లైబ్రరీలు ఏర్పాటు చేయబోతున్నామని ఆమె తెలిపారు. డిజిటల్ తరగతులను నిర్వహించడానికి అవసమైన ఏర్పాట్లు చేయబోతున్నామని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చొరవ తీసుకోవాలని ఎంఇఓ కృష్ణయ్యకు మంత్రి సూచించారు. విద్యార్థులు తప్పని సరిగా మాస్క్లు దరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్స్ వంగేటి ప్రభాకర్రెడ్డి, బండారి మనోహర్, సూర్ణ గంటి అర్జున్, పెద్ద బావి సుదర్శన్, ఎంఇవో కృష్ణయ్య, డిఇఇ అశోక్ రెడ్డి, ప్రధానో పాధ్యాయులు చైతన్య కుమార్ టీఆర్ఎస్ నాయకులు బీమిడి జంగారెడ్డి, రాళ్ళగూడెం శ్రీనివాస్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, ముత్యాల కృష్ణ,తదితరులు ఉన్నారు.