కవాడిగూడ:అనాధలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, కమిషన్ను ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించాలని అంజలి తెలంగాణ అనాధ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకటయ్య శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు వినతిపత్రం అందజేశారు.ఆర్టీఐ యాక్ట్-2005 ప్రకారం తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అనాధల హక్కులు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేసి అనాధలకు రక్షణ కల్పించాలన్నారు.
అనాధల అభివృద్ది కోసం వెబ్సైట్ను రూపొందించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అనాధల వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ, పైవేట్ ఉద్యోగాల్లో ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగాలు కల్పించే విధంగా స్పెషల్ రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ అనాధల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే విధంగా పనిచేయాలని కోరుతూ మంత్రితోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యలకు వినతి పత్రాన్నిఅందజేసినట్టు వెంకటయ్య తెలిపారు.