పహాడీషరీఫ్ : రోడ్డు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యల పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు 1, 9, 22, 23, 26 వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. స్పందించి కేవలం సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు రూ. 25 కోట్లను ఎచ్ఎండీఏ, టీఎస్ఐఐసి నుంచి నిధులను విడుదల చేయించారని తెలిపారు.
వాది దాలో ప్రధానరహదారిని తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ది చేయించానని గుర్తు చేశారు. ప్రస్తుతం వాది ఏ ముస్తఫా వరకు రూ. 1,75 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేయిస్తానన్నారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ. 52 కోట్లతో రిజార్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. టెండర్ ప్రక్రియ ముగిసింది. నెల లోపు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ పర్హాన నాజ్, కమిషనర్ జి.పి కుమార్, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు సౌద్ అవాల్గీ, జాఫర్ బామ్, పల్లపు శంకర్, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, ఖైసర్ బామ్, షేక్ అప్జల్, వాసుబాబు, హుస్సేన్, హసన్షా, దస్తగిర్, హమీద్ జైదీ, షేక్ అలీం, అలీ తదితరులు పాల్గొన్నారు.