ఘనంగా భోగభాగ్యాల భోగి
నారాయణపేటౌన్/రూరల్, జనవరి14: పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ ,కొల్లంపల్లి, వందర్గుట్టతండా, ఊటకుంటతండా, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం భోగి సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వాకిట్లో వివిధ రంగులతో రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పూజించారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పేట పట్టణంలో చెన్నప్ప పహాడి ఇంటి వద్ద ముస్లిం అమ్మాయి వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నది.
మక్తల్లో
మక్తల్రూరల్, జనవరి 14: ప్రతిఇల్లూ సంక్రాంతి శోభను సంతరించుకున్నది. భోగి మంటలు వేసుకుని ఇం టి ముంగిట సాంపి చల్లి గొబ్బెమ్మలను పెట్టి రేగి పండ్లు పోసి అందంగా అలంకరించారు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టారు. మక్తల్ మండలంలో ఆయా గ్రామాల్లో శుక్రవారం భోగిపండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ఆట లు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఇంటి వద్ద గంగిరెద్దులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. పస్పుల వద్ద ప్రసిద్ధి చెందిన దత్తాత్రేయస్వామి ఆలయం వద్ద భక్తులు సందడి చేశారు. కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
కృష్ణ మండలంలో..
కృష్ణ, జనవరి 14 : మండల కేంద్రంతో పాటు హిందూపూర్, ముడుమాల, కున్సి, ఆలంపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం ప్రజలు భోగి పండుగను ఘనంగా నిర్వహిం చారు. భోగి మంటలు వేసుకొని పాతచీపురు, పాతచేట ఇతర పాత సామగ్రిని మంటల్లో వేశారు. ఆడపిల్లలు ఇంటి వాకిళ్లలో రంగు రంగులతో ముగ్గులువేసి మధ్యన గొబ్బెమ్మలు పెట్టి వాటిపై గుమ్మడి పూలు అలంకరించి ఆడవాళ్లు కలిసి గొబ్బెమ్మపాటలు పాడారు. అనంతరం రకరకాల పిండి వంటలు చేశారు. ఐదేండ్ల్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు.
కోస్గిలో..
కోస్గి, జనవరి14: మకరసంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం భోగి పండుగ సందర్భంగా మ హిళలు తమ ఇంటిముందు రంగురంగు ముగ్గులువేసి వాకిళ్లను ముస్తాబుచేశారు. రైతులు నువ్వులకట్టె కాల్చి తమచుట్టూ తిప్పుకున్నారు.దీంతో క్రిమికీటకాలు దరిజేరవని రైతుల నమ్మకం.
ఆలయాలను దర్శించుకున్న భక్తులు
ఊట్కూర్, జనవరి 14 : సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకొన్నారు. శుక్రవారం భోగి పండుగను పురస్కరించుకుని వాకిళ్లలో ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. రొట్టెలు, పిండి వంటకాలతో విందు భోజనాలను ఆరగించారు. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానదీ తీరప్రాంతంలో గల పసుపుల, పంచదేవ్పహాడ్, కృష్ణ, ముడుమాల్ గ్రామాల వద్దకు ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకొని చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా నదీస్నానం చేశారు. పసుపుల దత్తాత్రేయ మందిరం, కృష్ణా గ్రామంలోని క్షీరలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు ముడుమాల్ నదీతీరంలో వెలసిన యాదవేంద్ర తీర్థ మఠాన్ని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణ మండలం మురహరిదొడ్డిలో క్షీరలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి పల్లకీసేవ, అభిషేకం, జల్ది బిందె ఊరేగింపు నిర్వహించారు. మల్లేపల్లి గ్రామంలో యువకులు జడకొప్పు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యమ్మ, ఉప సర్పంచ్ బాలస్వామి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామాల్లో యువతీ యువకులకు క్రికెట్ పోటీలు, ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.
నారాయణపేటౌన్/రూరల్, జనవరి14: పేట మండలంలోని జాజాపూర్, సింగారం, కోటకొండ ,కొల్లంపల్లి, వందర్గుట్టతండా, ఊటకుంటతండా, అప్పక్పల్లితో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం భోగి సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వాకిట్లో వివిధ రంగులతో రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పూజించారు. నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పేట పట్టణంలో చెన్నప్ప పహాడి ఇంటి వద్ద ముస్లిం అమ్మాయి వేసిన ముగ్గులు చూపరులను ఆకట్టుకున్నది.