హయత్నగర్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్ హయత్నగర్, సత్యానారాయణ కాలనీలో ఉన్న రాచకాలువపై అక్రమంగా వెలిసిన గుడిసెలను శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు.
గురువారం తెల్లవారుజామున కొంతమంది ఆక్రమణదారులు, ట్రాన్స్జెండర్లతో కలిసి సర్వే నెం. 199, ప్రభుత్వ స్థలంలో గుడిసెలు నిర్మించుకున్న సంగతి తెలిసిందే. హయత్నగర్ మండల తహసీల్దార్ సుశీల ఫిర్యాదు మేరకు హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
రాచకాలువపై అక్రమంగా వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగిస్తుండగా పలువురు మహిళలు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. దీంతో పలువురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సర్వే నెం.199లో రాచకాలువ స్థలంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్రావు, ఎస్ఐలు బుగ్గయ్య, కిరణ్రెడ్డి, నర్సిరెడ్డి, తాహెరాబేగం, కానిస్టేబుల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.