కేశంపేట, మే 15: మండలంలోని నిర్దవెళ్లిలో శనివారం రాత్రి ఇండ్ల పైకప్పులు గాలివానకు లేచిపోయి వర్షానికి ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. లేమామిడిలో గాలులకు చెట్ల కొమ్మలు విరిగి స్కూల్ బస్పై పడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లపై చెట్ల కొమ్మలు, విద్యుత్ స్తంభం కూడా విరిగిపడ్డాయి. లేమామిడి, నిర్దవెళ్లి, గాంధీశంకర్పల్లి, తుర్కలపల్లి తదితర గ్రామాల్లో చేతికంది వచ్చిన వరి చేళ్లు నేలకొరిగాయి. మామిడితోటల్లో మామిడికాయలు రాలిపోగా, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. తొమ్మిదిరేకులలో బ్రాయిలర్ కోళ్ల ఫారం నేలమట్టమైంది. కోళ్ల ఫారంలో ఉన్న 7వేల కోడిపిల్లల్లో 1500 పిల్లలు చనిపోగా రూ.16లక్షలకు పైగా నష్టం వాటిల్లింది.కొండారెడ్డిపల్లిలో ఆవుల షెడ్డులో గోడ కూలి ఆరుగురికి కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని స్థానికులు చికిత్స నిమి త్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అకాల వర్షంతో నష్టపోయినవారికి ప్రభుత్వం ఆర్థి క సాయం అందజేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
చేవెళ్ల టౌన్, మే 15 : చేవెళ్ల మండలంలో శనివారం రాత్రి గాలివాన బీభత్సంతో ధర్మసాగర్ గ్రామ సమీపంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో చేవెళ్ల పట్టణానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కందవాడ ఫీడర్ నుంచి చేవెళ్ల పట్టణానికి విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. విద్యుత్ మరమ్మతులు చేశారు.
శంకర్పల్లి, మే 15 : శంకర్పల్లిలో శనివారం రాత్రి గంట పాటు కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు నీటితో నిండాయి. రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 16.4 మి.మీ. వర్షం కురిసిందని అధికారులు తెలిపారు.
వికారాబాద్, మే 15 : వికారాబాద్లో శనివారం రాత్రి 8.30 నుంచి 11 గంటల వరకు భారీ భార్షం పడింది. రోడ్ల న్నీ జలమయమయ్యాయి. వివిధ పనుల నిమిత్తం వికారాబాద్కు వచ్చిన పలువురు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూరగాయల పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
ధారూరు, మే 15 : ధారూరు మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం రాత్రి దాదాపు గంట పాటు ఈదురు గాలులతో వర్షం కురిసింది. ప్రజలు కాస్తా ఇబ్బందులు పడ్డారు. మామిడి కాయలు రాలిపోయాయి. పొలం పనులు చేసుకునేందుకు రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.