ప్రియుడితో కలిసి భర్తను చంపి అమ్రాబాద్ అడవుల్లో పడేసిన భార్య పోలీసుల విచారణలో బయటపడిన ఆధారాలు
భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలింపు
షాబాద్, ఆగస్టు 29 : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ సంఘటన రంగారెడ్డిజిల్లా షాబాద్ మండలంలో జరిగింది. షాబాద్ సీఐ ఆశోక్ కథనం ప్రకారం.. మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పామెన మాణిక్యరావు(35)కు పన్నెండేండ్ల క్రితం షాబాద్కు చెందిన శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కొద్దిరోజులుగా షాబాద్కు చెందిన యాదయ్యతో శోభారాణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వీళ్ల సంబంధానికి ఆమె భర్త మాణిక్యరావు అడ్డుగా ఉన్నాడని.. ఎలాగైగా అడ్డు
తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 13న తనకు ఆరోగ్యం బాగులేదని శోభారాణి తన భర్తతో కలిసి షాద్నగర్ దవాఖానకు వెళ్లింది. దవాఖానకు చూపించుకుని అక్కడి నుంచి ఆటోలో మామిడిపల్లికి వచ్చారు. ఆటో దిగి ఇద్దరు రోడ్డు మార్గంగా నడుచుకుంటూ షాబాద్కు వస్తున్నారు. అప్పటికే తన ప్రియుడు యాదయ్యకు శోభారాణి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వాళ్ల ప్లాన్ ప్రకారమే యాదయ్య మామిడిపల్లి శివారుకు బైకుపై వెళ్లాడు. ఇద్దరు కలిసి చున్నీ తీసుకుని మాణిక్యరావు మెడకు కట్టి గట్టిగా బిగించి హత్య చేశారు. అప్పటికే సాయంత్రం 7 గంటలు కావడంతో మృతదేహాన్ని పొదల్లో వేశారు. మరుసటి రోజు యాదయ్య స్నేహితులైన వినోద్, శ్రీశైలం సహాయంతో ఒక కారు తీసుకుని వెళ్లి మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని శ్రీశైలం హైవేలో గల అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో గల లోయలో పడేసి తిరిగి వచ్చారు. తర్వాత ఇంటికి వచ్చిన శోభారాణి ఏమీ తెలియనట్లుగా మీ కొడుకు కనిపించడంలేదని అతడి తండ్రి అనంతయ్యకు చెప్పింది. ఈ నెల 24న అనంతయ్య షాబాద్ పొలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో శోభారాణి కదలికలపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఆదివారం నిందితురాలు శోభారాణి, ఆమె ప్రియుడు యాదయ్య, మరో ఇద్దరు వినోద్, శ్రీశైలంను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్ తెలిపారు.