కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 24: టీఆర్ఎస్ పటిష్టతకు మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషిచేయాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో అమలుచేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్నదన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నాలను చేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టాలని పార్టీనాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్యయాదవ్, ఉపాధ్యక్షుడు మామిడి దామోదర్రెడ్డి, జనరల్ సెక్రటరీ వన్నం బాలరాజు, పెంజర్ల గ్రామకమిటీ అధ్యక్షుడు సత్తయ్య, మార్కెట్కమిటీ మాజీ డైరెక్టర్ భీమయ్య, నాయకులు దేశాల లక్ష్మయ్య, రాజు, మల్లయ్య, రమేశ్, మాధవరెడ్డి పాల్గొన్నారు.
నూతన కమిటీ సభ్యులకు సన్మానం
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 24: కొత్తూరు మండలపరిధిలోని తీగాపూర్ గ్రామంలో సర్పంచ్ రమాదేవిరమేశ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జగన్మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మెండె కృష్ణయ్యయాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు జొల్లు బాలయ్యయాదవ్, గ్రామకమిటీ అధ్యక్షుడు యాదగిరి, పీఏసీఎస్ డైరెక్టర్ సాయిలు, నాయకులు రమేశ్, శేఖర్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
మండల ఉపాధ్యక్షుడికి..
కొత్తూరు మండలపరిధిలోని మల్లాపూర్తండా గ్రామపంచాయతీకి చెందిన పాత్లావత్ లక్ష్మణ్నాయక్ను మండల ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లక్ష్మణ్నాయక్ను మల్లాపూర్తండా టీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్నాయక్, తులసీరాంనాయక్ పాల్గొన్నారు.
నందిగామ మండల అధ్యక్షుడిగా పద్మారెడ్డి
నందిగామ, సెప్టెంబర్24: నందిగామ మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల కమిటీ ఎన్నికల ఇన్చార్జి యాదగిరి, రాజవరప్రసాద్ ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ సమక్షంలో పార్టీ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా నోముల పద్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా పి. శ్రీశైలం, సుదర్శన్గౌడ్, గోపాల్రెడ్డి, కార్యదర్శిగా ఆంజనేయులు, యూత్ కమిటీ అధ్యక్షుడిగా కె.శ్రీకాంత్గౌడ్, ఉపాధ్యక్షుడిగా మహేశ్, కార్యదర్శిగా సురేశ్, సోషల్ మీడియా అధ్యక్షులుగా మంగళి వెంకటేశ్, గుండల శ్రీనివాస్, బుడ్డగొల్ల శ్రీను, వెంకట్చారి, బీసీ సెల్ అధ్యక్షుడిగా అంజయ్య, ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కార్యదర్శిగా మహేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎర్రోళ్ల నర్సింహా, ఉపాధ్యక్షుడిగా కృష్ణయ్య, కార్యదర్శిగా నర్సింహులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా జటావత్ సురేందర్, ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్, రమాదేవి, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా జహీరుద్దీన్, యూనుస్, కార్యదర్శిగా హబీబ్లను ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు రాజ్యలక్ష్మి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నియామక పత్రాల అందజేత
శంకర్పల్లి, సెప్టెంబర్ 24 : టీఆర్ఎస్ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం గెస్ట్హౌజ్ ఆవరణలో మండల, మున్సిపాలిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా కావలి గోపాల్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా రావులపల్లి గ్రామానికి చెందిన హన్మంత్రెడ్డి ఎన్నికయ్యారు. శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వి.వాసుదేవ్కన్నా ఎన్నికయ్యారు. మున్సిపల్ టీఆర్ఎస్ యువజన అధ్యక్షుడిగా జూలకంటి పాండురంగారెడ్డి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యె కాలెయాదయ్య ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ చేకుర్త గోవిందమ్మ, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, టీఏసీఎస్ చైర్మన్ బద్ధం శశిధర్రెడ్డి, కౌన్సిలర్లు చంద్రమౌళి, శ్రీనాథ్గౌడ్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ మహమూద్, నాయకులు పార్శి బాలకృష్ణ, రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.
మాడ్గుల టీఆర్ఎస్ నూతన కార్యవర్గం
ఆమనగల్లు (మాడ్గుల), సెప్టెంబర్24: మాడ్గుల మండలంలో టీఆర్ఎస్ నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడితో పాటు 22 మందికి కమిటీలో స్థానం కల్పించారు. అధ్యక్షుడిగా ఎంపీటీ జైపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు జెల్లయాదయ్య, బండారి బ్రహ్మం, లక్పతినాయక్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ జంగయ్య, అధికార ప్రతినిధి కొప్పుల వెంకటయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పి.రాజుగౌడ్, ఎ.కుమార్, సంయుక్త కార్యదర్శులుగా వెంకటయ్య, యాదయ్య, బక్కయ్య, ప్రచార కార్యదర్శి పల్లెటి యాదయ్య, తిరుపతయ్య, ఖాజామియా, కోశాధికారి నిరంజన్, కార్యవర్గ సభ్యులుగా ఆంజనేయులు, జానానాయక్, శ్రీను, రాములు, పాండు, నారాయణ, యాదయ్యలను ఎన్నుకున్నారు.
షాద్నగర్ మున్సిపాలిటీ కమిటీ ఎన్నిక..
షాద్నగర్, సెప్టెంబర్24 : షాద్నగర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ నూతన కమిటీ, అనుబంధ కమిటీలను శుక్రవారం ప్రకటించారు. మున్సిపాలిటీ అధ్యక్షుడిగా ఎంఎస్. నటరాజన్, ఉపాధ్యక్షులుగా రఘుమారెడ్డి, వెంకటేశ్గౌడ్, చెన్నయ్య, ప్రధాన కార్యదర్శిగా చీపిరి రవియాదవ్, కార్యనిర్వహణ కార్యదర్శిగా జి. నారాయణ, సాంబశివరావు, ఆకుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా రవి, జకీరుద్దీన్, ప్రచార కార్యదర్శులుగా శ్రీనాథ్, రాఘవేందర్, త్రినాథ్, కోశాధికారిగా వన్నాడ వెంకటేశ్గౌడ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా ఎం. నర్సింగ్, ఉపాధ్యక్షులుగా సుదర్శన్, విష్ణు, ప్రధాన కార్యదర్శిగా మూర్తి, ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ప్రవీణ్నాయక్, ఉపాధ్యక్షుడిగా చందర్, ప్రధాన కార్యదర్శిగా రుక్యా, బీసీ విభాగం అధ్యక్షుడిగా గాదే సుధాకర్, ఉపాధ్యక్షులుగా నందిగామ రామచందర్, రాజుగౌడ్, అశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డమీది రమేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా లంకాల రాఘవేందర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా రాఘవేందర్గౌడ్, అజయ్, అశోక్యాదవ్, ప్రధాన కార్యదర్శిగా పిన్నమోని గోపాల్, కోశాధికారిగా గుండ్రాతి కిరణ్లతో పాటు అన్ని విభాగాలకు సభ్యులను నియమించారు.
పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి
చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 24 : టీఆర్ఎస అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో టీఆర్ఎస్ కార్యవర్గాన్ని సర్పంచ్ తులసిరాజ్, మాజీ సర్పంచ్ హన్మంత్రెడ్డిల సమక్షంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. కమ్మెట గ్రామ కమిటీ అధ్యక్షుడుడిగా వి.అంజన్కుమార్గౌడ్, ఉపాధ్యక్షుడిగా సిఎచ్.నర్సింహులు, యూత్ అధ్యక్షుడిగా నరేందర్గౌడ్, ఉపాధ్యక్షుడిగా అచ్చిని దశరథ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎం.నర్సింహులు గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు మాధవగౌడ్, అంతయ్య, నర్సింహులు, బాలకృష్ణ, వెంకటేశ్, కృష్ణారెడ్డి, పెంటయ్య, జంగయ్య, మహేందర్, సతీశ్, రామయ్య పాల్గొన్నారు.
కేశంపేటలో ఏకగ్రీవంగా..
కేశంపేట, సెప్టెంబర్ 24 : టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మురళీధర్రెడ్డిని మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పుట్టోనిగూడెం సర్పంచ్ జగన్నాయక్, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పెద్దిని రాజు, నాయకులు రాజునాయక్, జంగ శేఖర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అనుబంధ కమిటీల ఎన్నిక
కొందుర్గు, సెప్టెంబర్ 24 : జిల్లెడు చౌదరిగూడ మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ యూత్ కమిటీ మండల అధ్యక్షుడిగా దీమ గణేశ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడుడిగా నర్సింహులు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడిగా రాజు నాయక్, మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా సలీం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కుమార్లకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హాఫీజ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన వారందరికీ అందించాలని అన్నారు. కార్యక్రమంలో నాయకులు దర్గా రామచంద్రయ్య, రెడ్డి నర్సింహులు, వెంకటేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ యూత్వింగ్ కమిటీకి సన్మానం
కడ్తాల్, సెప్టెంబర్ 24 : టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గాన్ని కడ్తాల్, ఆమనగల్లు మండలాల సింగిల్విండో చెర్మన్ వెంకటేశ్ సింగిల్విండో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇర్షాద్, కృష్ణ, మహేశ్, శ్రీను, శ్రీకాంత్, శ్రీశైలం, శివ, హరీశ్, జగన్, మహేశ్, భరత్, కిరణ్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు తగిన గుర్తింపు : ఎమ్మెల్యే కిషన్రెడ్డి
మంచాల, సెప్టెంబర్ 24 : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ మంచాల మండల యువజన విభాగం అధ్యక్షుడు వనపర్తి బద్రినాథ్గుప్తా, ప్రధాన కార్యదర్శి గంట విజయ్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు బొట్టు ప్రవీణ్ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు. కలిసిన వారిలో ఎంపీపీ నర్మద, పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శి బహదూర్, నాయకులు ప్రభాకర్, జానీపాషా, వీరేశం, సాయిగౌడ్ ఉన్నారు.