ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 21 : పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పిద్దామని ఏసీపీ బాలకృష్ణరెడ్డి అన్నారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, గాయకుడు విజయ్కుమార్ పోలీసు అమరులను స్మరిస్తూ పాడిన పాటల సీడీని ఏసీపీ బాలకృష్ణారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులను స్మరిస్తూ పాడిన విజయ్కుమార్ను అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్, యువజన విభాగం మండలాధ్యక్షుడు ప్రసాద్తో పాటు కరుణాకర్, మహేశ్ పాల్గొన్నారు.
పోలీసు అమరులకు నివాళి
ఆమనగల్లు, అక్టోబర్ 21 : ఆమనగల్లు పోలీసు స్టేషన్ ఆవరణలో అమరుడు హన్మంత్రెడ్డి విగ్రహానికి సీఐ ఉపేందర్, ఎస్సై ధర్మేశ్, వరప్రసాద్, పోలీసు సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేసిన యువకులను సీఐ అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
పోలీసుల త్యాగం మరువలేనిది
మంచాల అక్టోబర్ 21 : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగం మరువలేనిదని సీఐ వెంకటేశ్ గౌడ్ అన్నారు. మంచాల పోలీసుస్టేషన్ ఆవరణలో అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు సురేశ్, రామన్గౌడ్ పాల్గొన్నారు.
త్యాగాలు వెలకట్టలేనివి
తలకొండపల్లి ఆక్టోబర్ 21 : విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని ఎస్ఐ శివశంకర్వరప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలో పోలీస్ అమరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. కార్యక్రమంలో ఏఎస్సై నర్సింహశెట్టి, ప్రసాద్జి, హెడ్కానిస్టేబుల్ రాంలాల్, శేఖర్, నాయకులు మోహన్రెడ్డి, పాండు, కుమార్, నర్సింహ పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి..
యాచారం, అక్టోబర్ 21 : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకారాలు అందించాలని సీఐ లింగయ్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 1997లో మావోయిస్టులు యాచారం పోలీస్స్టేషన్ను పేల్చివేయడంతో మరణించిన కానిస్టేబుళ్లు మహ్మద్ జమీల్ అహ్మద్, ముడుపు రాజేశ్వర్రావు చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం సాగర్ రహదారిపై పోలీసులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐలు ప్రభాకర్, పద్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.