ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీలకు సోమవారం నూతన అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అందరి ఏకాభిప్రాయం మేరకు ఈ ఎన్నికలను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలకు నూతనంగా అధ్యక్షులను ఎన్నుకోగా మంచాల, యాచారం మండలాలకు పాతవారినే ఎన్నుకున్నారు.
యాచారం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా రమేశ్గౌడ్
యాచారం, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా మంథన్గౌరెల్లి గ్రామానికి చెందిన కర్నాటి రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లికి చెందిన పి. బాషా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి వీరిని నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి సలహాలు, సూచనల మేరకు మండలంలోని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా చీరాల రమేష్
మంచాల సెప్టెంబర్ 20: మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆరుట్ల గ్రామానికి చెందిన చీరాల రమేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలోని ఓ గార్డెన్లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే మంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్ష, కార్యదర్శులను ఎమ్మెల్యే సమక్షంలో ఎన్నుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా చీరాల రమేష్, ప్రధాన కార్యదర్శిగా చెన్నారెడ్డి గ్రామానికి చెందిన బహదూర్ను ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు రమేశ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి, మండల నాయకులకు కృతజ్ఞతుల తెలిపారు.
టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి
పెద్దఅంబర్పేట, సెప్టెంబర్ 20: పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా పెద్దఅంబర్పేటకు చెందిన సిద్దంకి కృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొమవారం కృష్ణారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే విధంగా మున్సిపాలిటీ టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా మర్రిపల్లికి చెందిన పాశం దామోదర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
శంకర్పల్లి, సెప్టెంబర్ 20 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని మోకిలతండా టీఆర్ఎస్ గ్రామ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వర్త్య సుభ్యునాయక్, ఉపాధ్యక్షులుగా రాజ, శివ, సంయుక్త కార్యదర్శులుగా డాక్యనాయక్, మాల్యనాయక్, కోశాధికారిగా వర్త్య పుల్యాలు ఎన్నిక కాగా, కార్యవర్గ సభ్యులుగా రవినాయక్, కిషన్నాయక్, రెడ్యానాయక్, శంకర్నాయక్, రాములునాయక్, కమల్నాయక్, సలహాదారులుగా సబావత్ రాజునాయక్, సబావత్ సరితానాయక్, చోక్లానాయక్, రామునాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.