చేవెళ్ల రూరల్, అక్టోబర్ 19: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేశారు. అందుకోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రగతిలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామం. పల్లె ప్రగతి పనులన్నీ పూర్తి చేసుకుని అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
మౌలిక వసతుల కల్పన..
అంతారం (నవలయపల్లి అనుబంధ గ్రామం) జనాభా 2000, ఓటర్లు 1400 మంది ఉన్నారు. పంచాయతీలో రూ.25 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.2 లక్షలతో వీధి దీపాల ఏర్పాటు, రూ.2 లక్షలతో సీసీ కెమెరాలు, రూ.10 లక్షలతో ట్రాక్టర్, రూ.10 లక్షలతో వైకుంఠధామం నిర్మాణం, రూ.1.5 లక్షలతో డంపింగ్ యార్డు, రూ.25 వేలతో నర్సరీ, పల్లె ప్రకృతి వనం దాదాపు రూ.70 లక్షలతో పనులు చేపట్టారు. ఇంకా రూ.25 లక్షల పనులు చేపట్టాల్సి ఉన్నది. సర్పంచ్ సులోచనా అంజన్గౌడ్, పంచాయతీ కార్యదర్శి అనూష ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
సమస్యల పరిష్కారం..
గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటుతో ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి. పారిశుధ్య నిర్వహణలో భాగంగా తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డుకు తరలించి, కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారీకి ఉపయోగించుకుంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా, గ్రామ పరిసరాల్లో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి
పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైంది. పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తున్నాం. రోజూ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువు తయారు చేయిస్తున్నాం.
అధిక నిధులతోనే గ్రామాభివృద్ధి
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల రూపురేఖలు మారాయి. పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహిస్తున్నారు. గతంలో ఏ సీఎం చేయని పనులు చేపట్టి, గ్రామాలను ఆదర్శంగా నిలుపుతున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారుతున్నాయి.
ఏండ్లనాటి సమస్యలు పరిష్కారం..
ఏండ్ల నాటి నుంచి గ్రామంలో పేరుకు పోయిన సమస్యలను పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిష్కరించాం. ప్రభుత్వం, పంచాయతీ నిధులతో గ్రామం లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేప డుతున్నాం. ప్రజలకు మౌలిక సదుపాయా లు కల్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.