కడ్తాల్, సెప్టెంబర్ 19 : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడంలో పీఆర్టీయూది కీలకపాత్ర అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గుప్తా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్యాదవ్ అన్నారు. శనివారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో నిర్వహించిన పీఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా జగన్మోహన్గుప్తా, గోవర్దన్యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్గుప్తా మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంక్షేమానికి పీఆర్టీయూ కృషి చేస్తున్నదని తెలిపారు. ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కారిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న వారిని పీఆర్టీయూ నాయకులు సన్మానించారు.
కడ్తాల్, ఆమనగల్లు మండలాల పీఆర్టీయూ కమిటీల ఎన్నిక..
మండల కేంద్రంలో నిర్వహించిన పీఆర్టీయూ సర్వసభ్య సమావేశంలో కడ్తాల్, ఆమనగల్లు మండలాల పీఆర్టీయూ కమిటీలను ఎన్నుకున్నారు. పీఆర్టీయూ కడ్తాల్ మండలాధ్యక్షుడిగా నరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పద్మావత్తమ్మ, ఆమనగల్లు అధ్యక్షుడిగా మహ్మద్ అహ్మద్, ప్రధాన కార్యదర్శిగా పాండురంగయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు శ్రీనివాసచారి, శ్రీనివాసులు, పద్మజారాణి, జిల్లా బాధ్యులు రవీందర్రెడ్డి, కిశోర్కుమార్, లోక్యానాయక్, ధర్మేందర్రావు, భగవాన్రెడ్డి, నరేందర్రెడ్డి, రవీందర్రావు పాల్గొన్నారు.