ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప్రజా సంక్షేమం దాగి ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో తాత్కాలిక పండ్ల మార్కెట్ను ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి శుక్రవారం మంత్రి ప్రారంభించారు. కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని మంత్రి తెలిపారు. రైతులు, వ్యాపారులు, హమాలీలకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. విజయదశమి రోజు వ్యాపార లావాదేవీలు మొదలు పెడుతున్న వారందరికి విజయం చేకూరాలని ఆమె కోరారు. భవిష్యత్లో కొహెడ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్గా మారుతుందని అన్నారు. రూ.12 వందల కోట్లతో 2వేల బెడ్స్తో అన్ని విభాగాలు ఉండేలా సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు.
అబ్దుల్లాపూర్మెట్, అక్టోబర్ 16 : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాట సిం గారం లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పండ్ల మార్కెట్ను ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం రావాలంటే గాంధీ, ఉస్మానియా దవాఖానలు తప్ప మరొకటిలేదన్నారు. కరోనా సమయంలో ప్రజల ఇబ్బం దులను గ్రహించి సీఎం కేసీఆర్ నగరంలో నాలుగు దిక్కుల మంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అందులో రెండు దవాఖానలు రంగారెడ్డి జిల్లాలోనే వస్తున్నాయని ఒకటి గచ్చిబౌలి, రెండోది గడ్డిఅన్నారంలో అని మంత్రి స్పష్టం చేశారు. కొహెడ లో ఏర్పాటు చేస్తున్న మార్కెట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలని, ఎక్కడ కూడా రాజీపడే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు.. త్వరలో అన్ని హంగులతో అధునాతన మార్కెట్ను నిర్మిం చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులకు, వ్యాపారస్తులకు, హమాలీలకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఏమైన మిగిలి ఉన్న సమ స్యలు ఉంటే వారం తర్వాత సమీక్ష చేసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. అనంతరం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన పండ్ల క్రయ, విక్ర యాల వేలంపాటలో పాల్గొని పండ్లను కొనుగోలు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండా ల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. కొహెడలో 170 ఎకరాల్లో నిర్మి స్తున్న మార్కెట్కు గడ్డిఅన్నారంలో నిర్మించే మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ రోజే నిధులు ఇప్పిస్తానన్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు బాటసింగారంలోనే క్రయ, విక్రమయాలు జరుగుతాయని తెలిపారు. భవి ష్యత్లో కొహెడ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్గా తయారవుతుంద న్నా రు. రైతులకు, వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా ల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖ, పాలకవర్గం పై ఉందన్నారు. మార్కెట్ ఏర్పాటుతో పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. లాజిస్టిక్ పార్కులో భూములు కోల్పోయిన 10 మందికి 120 గజాల స్థలం ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ కొహెడ మార్కెట్ నంబర్ వన్గా నిలుస్తుందన్నారు. రూ. 12 వందల కోట్ల తో 2వేల బెడ్స్తో అన్ని విభాగాలు ఉండే విధంగా సూపర్ స్పెషాలిటి దవా ఖాన నిర్మితం కానుందన్నారు. మార్కెట్కు రోజు రెండు ట్రిప్పులు ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కందాడ ముత్యంరెడ్డి అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్, మార్కెటింగ్శాఖ సంచాలకులు జి. లక్ష్మీ బాయి, అదనపు సంచాలకులు లక్ష్మణుడు, ఉన్నతశ్రేణి కార్యదర్శి వైజె పద్మ హర్ష, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు అక్భర్ అలీఖాన్, ఎంపీపీ బుర్ర రేఖమహేందర్గౌడ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌస్పాషా, సర్పంచ్లు ఎర్రవెల్లి లతశ్రీగౌరీశంకర్, కోట రాధాలక్ష్మారెడ్డి, ఎంపీటీసీ కేశెట్టి వెంకటేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కొత్త కిషన్గౌడ్, అడాల రమేశ్, కొండల్రెడ్డి, రవీందర్, అనిల్చౌదరి, కృష్ణమాచారి, లాజిస్టిక్పార్కు మేనేజర్ గురుపాదం, అదనపు మేనేజర్ ప్రభాకర్ ఉన్నారు.