గ్రామాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ కమిటీల ఎన్నిక
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతల పిలుపు
కొత్తూరు రూరల్, సెప్టెంబర్ 12 : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎంపీపీ మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని గూడూరు, మక్తగూడ, తీగాపూర్, మల్లాపూర్తండా గ్రామాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో గ్రామాల వారీగా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ మధుసూదన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్యనారాయణ హాజరై ఎన్నికల పరిశీలకులు నారాయణరెడ్డి, శేఖర్పంతులు సమక్షంలో కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. గూడూరు టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా గుండు సురేశ్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడిగా మైలారం అశోక్, మక్తగూడ టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా దయ్యాల పాండు, తీగాపూర్ గ్రామకమిటీ అధ్యక్షుడిగా మారవోని యాదయ్యయాదవ్, ఉపాధ్యక్షుడిగా చిర్ర చెన్నయ్య, మల్లాపూర్తండా గ్రామకమిటీ అధ్యక్షుడిగా పాత్లావత్ లోబ్యానాయక్, ఉపాధ్యక్షుడిగా తులసీరాంనాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు బ్యాగరి సత్తయ్య, కాట్నరాజు, రమాదేవిరమేశ్, రవినాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పద్మారావు, నాయకులు మెండె కృష్ణయ్యయాదవ్ పాల్గొన్నారు.
పార్టీని బలోపేతం చేయాలి
శంకర్పల్లి, సెప్టెంబర్ 12 : మండలంలో మోకిల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీటీసీ ఎస్.యాదయ్య, ఉపాధ్యక్షుడిగా మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎండీ అబ్దుల్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా దాసరి నగేశ్, సంయుక్త కార్యదర్శిగా మైలారం వెంకటయ్య, కోశాధికారిగా ఈ.అంజయ్యతో పాటు 10 మంది సభ్యులను ఎన్నుకున్నారు. మైనారిటీ అధ్యక్షుడిగా ఎండీ ఖాజా, టీఆర్ఎస్ గ్రామ యువజన అధ్యక్షుడిగా గండి కృష్ణ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు హన్మంత్రెడ్డి, మన్నె లింగంముదిరాజ్, గోపాలచారి, రవినాయక్, చోక్లానాయక్, ఎండీ ఫాజిల్, గౌండ్ర కుషలయ్య, రామస్వామి, వెంకటేశ్, సాయిలు, జే.జగన్గౌడ్, విజయ్, బీ.సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు అధ్యక్షుడిగా జానంపేట్ రాములు, ఉపాధ్యక్షుడిగా కే.నారాయణరెడ్డి, పీ.చంద్రశేఖర్రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా బీ.శ్రీనివాస్, బీ.ప్రశాంత్, కోశాధికారిగా ఉప్పు నర్సింహులుతో పాటు 18 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ బీ.వెంకట్రాంరెడ్డి, కోఆప్షన్ సభ్యులు వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు. 6వ వార్డు అధ్యక్షుడిగా జే.జగన్గౌడ్, ఉపాధ్యక్షుడిగా పీ.రాఘవేందర్రెడ్డి, కార్యదర్శి ఈ.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఎం.శ్రీరాములు, కోశాధికారిగా విష్ణువర్దన్రెడ్డి ఎన్నికయ్యారు.
రెడ్డిపల్లి అధ్యక్షుడిగా అనిల్
మొయినాబాద్, సెప్టెంబర్ 12 : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నూతన కమిటీ అధ్యక్షుడిగా అనిల్, ఉపాధ్యక్షులుగా రఘు, ఎర్ర వెంకటేశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా బసగల్ల ఉదయ్, స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షుడుగా కావలి వివేక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గడ్డం చెన్నయ్య, బీసీ సెల్ అధ్యక్షుడిగా కుండె అనంతయ్య, ప్రధాన కార్యదర్శిగా గడ్డం ప్రకాశ్, సంయుక్త కార్యదర్శులుగా మల్లేశ్, అంజయ్యను నియమించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీలు పార్టీ బలోపేతానికి పని చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గునుగుర్తి జయవంత్, మండల ప్రధాన కార్యదర్శిగా నర్సింహాగౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మోర శ్రీనివాస్, నాయకులు జగదీశ్వర్రెడ్డి, రాంచంద్రయ్య, గోవింద్, శ్రీనివాస్రెడ్డి, శంకరయ్య, మహేశ్, ప్రవీణ్, డి సాయి, కె అశోక్ పాల్గొన్నారు.
ముమ్మరంగా గ్రామ కమిటీల ఎన్నికలు
కొందుర్గు, సెప్టెంబర్ 12 : కొందుర్గు మండలంలోని తంగెళ్లపల్లి, చిన్న ఎల్కిచర్ల గ్రామాల్లో గ్రామ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జిల్లెడు చౌదరిగూడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల, గుర్రంపల్లి, రావిర్యాల, కాస్లాబాద్ గ్రామాల్లో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, హఫీజ్ , వైస్ ఎంపీపీ రాజేశ్పటేల్, కొండి యాదయ్య, కృష్ణయ్య, ఎదిర రామకృష్ణ పాల్గొన్నారు.
మల్లారెడ్డిగూడ అధ్యక్షుడిగా జంగయ్య..
షాబాద్, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ గ్రామంలో జడ్పీటీసీ అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పెద్దేటి జంగయ్యను నియమించారు. ఈ సందర్భంగా అవినాశ్రెడ్డి మాట్లాడుతూ…పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరిగి గణేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింగ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నాయకులు గోపాల్, శేఖర్గౌడ్, సత్యనారాయణ, రాజు, వెంకటయ్య, బాల్రాజ్, ప్రభాకర్, జయంత్రెడ్డి, బుర్ర రాజుగౌడ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
షాద్నగర్టౌన్లో..
షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 12 : ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్ అన్నారు. మున్సిపాలిటీలోని 3వ వార్డు చటాన్పల్లిలో ఆదివారం టీఆర్ఎస్ వార్డు కమిటీ అధ్యక్షుడిగా బాల్రాజ్, ఉపాధ్యక్షుడిగా రాజు, కార్యదర్శిగా ఆంజనేయులు, యూత్ కమిటీ అధ్యక్షుడిగా నరేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సాయికృష్ణగౌడ్, కార్యదర్శిగా గణేశ్, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా సురేశ్, ఉపాధ్యక్షుడిగా జంగయ్య, కార్యదర్శిగా చంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా అంజయ్యను ఎన్నుకుని నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాండురంగారెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్గౌడ్, నాయకులు రాజు, వెంకటేశ్, దర్శణ్, శ్రీపాల్, శ్రీశైలం, మహేశ్, ఆంజనేయులు, రవి, దశరథ్, సాయిరెడ్డి, అంజయ్య, యాదగిరి, లింగం, వెంకటయ్య, పాల్గొన్నారు.
5వ వార్డులో
5వ వార్డు సోలిపూర్లో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వార్డు కమిటీ అధ్యక్షుడిగా చీపిరి రమేశ్యాదవ్, ఉపాధ్యక్షుడిగా యాదయ్య, కార్యదర్శులుగా సోమ్లానాయక్, రాఘవేందర్, లక్ష్మయ్య, నరేశ్, కలీంపాష, జంగయ్య, శేఖర్, కిషన్, యూత్ కమిటీ అధ్యక్షుడిగా ప్రవీణ్కుమార్, ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్, కార్యదర్శులుగా రాజవర్ధన్, రవి, రాము, శ్రీహరి, మహేశ్, వెంకటేశ్, కుమార్, శివ, బీసీ కమిటీ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రాజు, పవన్, శ్రీను, మహేందర్, నర్సింహులు, మహేశ్, శ్రీను, శ్రీకాంత్, వెంకటేష్, శ్రీశైలం, ఎస్సీ కమిటీ అధ్యక్షుడిగా వెంకటేశ్, ఉపాధ్యక్షుడిగా మల్లేశ్, కార్యదర్శులుగా యాదయ్య, కుమార్, బాల్రాజు, జంగయ్య, రాములు, ఆంజనేయులు, శంకరయ్య, ఎస్టీ కమిటీ అధ్యక్షుడిగా చందర్నాయక్ను ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షుడు చీపిరి రమేశ్యాదవ్కు కౌన్సిలర్ కృష్ణవేణి, ఎన్నికల అధికారి జమల్ఖాన్ నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం సత్యనారాయణయాదవ్, వెంకటేశ్, ఆంజనేయులు, గంగాధర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఏకగ్రీవం
నందిగామ, సెప్టెంబర్ 12 : మండలంలోని చేగూర్, వెంకమ్మగూడ, బండోనిగూడ, బుగ్గోనిగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలాధ్యక్షుడు నోముల పద్మారెడ్డి తెలిపారు. చేగూర్ అధ్యక్షుడిగా తుక్కుగూడ రవి, ఉపాధ్యక్షులుగా ఎర్రోళ్ల రాజశేఖర్, బాల్రాజ్, కార్యదర్శిగా జంగయ్యను ఎన్నుకున్నారు. వెంకమ్మగూడ అధ్యక్షుడిగా గొర్లపల్లి విజయ్, ఉపాధ్యక్షుడిగా గుండాల రాజేశ్, కార్యదర్శిగా ప్రవీణ్, బండోనిగూడ అధ్యక్షుడిగా జాలగూడెం అంజయ్య, ఉపాధ్యక్షుడిగా శంకర్నాయక్, కార్యదర్శిగా శ్రీనివాస్, బుగ్గోనిగూడ అధ్యక్షుడిగా బుగ్గ యాదయ్య, ఉపాధ్యక్షుడిగా పాండు, కార్యదర్శిగా బండి శేఖర్తో పాటు కార్యవర్గాలు, అనుబంధ కార్యవర్గాలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్గౌడ్, ఎన్నికల ఇన్చార్జిలు యాదగిరి, జంగయ్య, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు గోవింద్ అశోక్, కుమార్ పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది
చేవెళ్ల టౌన్,సెప్టెంబర్ 12 : మండల పరిధిలోని ఆలూర్, గుండాల గ్రామాల్లో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి సమక్షంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఆలూర్ కమిటీ అధ్యక్షుడిగా కొండకళ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడిగా పూలపల్లి యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా చన్గోముల్ నర్సిములు, ప్రచార కార్యదర్శిగా చెట్టుకింది జంగయ్య, మైనార్టి సెల్ అధ్యక్షుడిగా ఎండీ హాజీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. గుండాల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కావలి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా నక్క శ్రీరాంరెడ్డి, యూత్ అధ్యక్షుడిగా నక్క శ్రీకాంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు రవి, ఏఎంసీ డైరెక్టర్ అబ్దుల్ గని, ఆలూర్ సర్పంచ్ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ వెంకటేశ్, ఎంపీటీసీలు నరేందర్, గుండాల ఉప సర్పంచ్ బాలరాజ్ పాల్గొన్నారు.