ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 9 : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు యాదగిరి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 1, 13, 11 వార్డుల్లో టీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులను మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు యాదగిరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. 1వ వార్డు అధ్యక్షుడిగా భానుచందర్, ప్రధాన కార్యదర్శి మహేశ్, 11వ వార్డు అధ్యక్షుడిగా వర్త్య రాందాస్, ప్రధాన కార్యదర్శిగా కాట్రోతు మురళీకృష్ణ, 13వ వార్డు అధ్యక్షుడిగా మంతని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ మునీర్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ భరత్కుమార్, నాయకులు మహేశ్గౌడ్, మొద్దు అంజిరెడ్డి పాల్గొన్నారు.
ముమ్మరంగా గ్రామ కమిటీల నియామకం
యాచారం, సెప్టెంబర్ 9 : యాచారం, తక్కళ్లపల్లి, ధర్మన్నగూడ గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. యాచారంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాష ఆధ్వర్యంలో నూతన కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా మస్కు జనార్ధన్, ఉపాధ్యక్షుడిగా వెంకట్రెడ్డి, కార్యదర్శిగా అజ్మత్, సంయుక్త కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా ప్రభాకర్, కార్యవర్గ సభ్యులుగా కృష్ణ, జమాల్, సత్తమ్మ, కళ్లమ్మ, ఐవీఎస్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడిగా జావెద్, కార్యదర్శిగా వంశీ, సోషల్ మీడియా కన్వీనర్గా పవన్ను ఎన్నుకున్నారు. జడ్పీటీసీ జంగమ్మ ఆధ్వర్యంలో తక్కళ్లపల్లి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా యాదయ్య, కార్యదర్శిగా చంద్రశేఖర్రెడ్డి, యూత్ అధ్యక్షుడిగా రమేశ్, కార్యదర్శిగా ప్రభాకర్, బీసీసెల్ అధ్యక్షురాలిగా భవానీ, కార్యదర్శిగా సురేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మల్లేశ్, కార్యదర్శిగా సత్యనారాయణను నియమించారు. పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్మన్నగూడ కమిటీ అధ్యక్షుడిగా గణేశ్, కార్యదర్శిగా ఆనంద్, ఉపాధ్యక్షుడిగా బాల్రాజ్, సంయుక్త కార్యదర్శిగా మధు, కోశాధికారిగా శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు సంతోష, నర్సిరెడ్డి, కృష్ణ, జగదీశ్ నాయకులు తలారి మల్లేశ్, నర్రె మల్లేశ్, సుధర్శన్రెడ్డి, యాదయ్య, మస్కు రమేశ్, ఖాజు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక
తలకొండపల్లి, సెప్టెంబర్ 9 : మండల పరిధిలోని చుక్కాపూర్, వెల్జాల్ గ్రామాల టీఆర్ఎస్ కమిటీలను మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్యాదవ్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చుక్కాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మల్లేశ్, ఉపాధ్యక్షుడిగా కె.మల్లేశ్, కార్యదర్శిగా దశరథ్, సంయుక్త కార్యదర్శిగా నరేశ్రెడ్డి, బీసీ సెల్ ప్రెసిడెంట్గా మల్లేశ్, ఉపాధ్యక్షుడిగా రమేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా కృష్ణ, కార్మిక విభాగం అధ్యక్షుడిగా అనంతరాములు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా పద్మమ్మ, ఉపాధ్యక్షురాలిగా పార్వతమ్మ, యువజన విభాగం అధ్యక్షుడిగా భువనేశ్వర్, ఉపాధ్యక్షుడిగా శ్రీనును ఎన్నుకున్నారు. వెల్జాల్ గ్రామాధ్యక్షడిగా శ్రీకాంత్యాదవ్, ఉపాధ్యక్షుడిగా రాజేందర్రెడ్డి, కార్యదర్శిగా పెంటయ్యగౌడ్, సంయుక్త కార్యదర్శిగా పరందాములు, కోశాధికారిగా రాములుతో పాటు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో బాలకిష్టయ్య, నరేందర్, దస్తగిర్, మోహన్లాల్, శ్రీధర్రెడ్డి, ఆనంద్, వెంకట్రెడ్డి, శ్రీను, మల్లేశ్ పాల్గొన్నారు.
కాట్రగాని తండా అధ్యక్షుడిగా చంద్రశేఖర్
ఆమనగల్లు(మాడ్గుల)సెప్టెంబర్ 9 : మండలంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు జోరుగా ఏర్పడుతున్నాయి. మండలంలోని కాట్రగాని తండాలో వైస్ఎంపీపీ శంకర్నాయక్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. తండా అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శి లక్పతినాయక్ కార్యవర్గ సభ్యులను ఎన్నుకొన్నారు.
కొర్రవాని తండా అధ్యక్షుడిగా కేశవులు
మంచాల సెప్టెంబర్ 9 : మండల పరిధిలోని కొర్రవాని తండా నూతన కమిటీని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్ అధ్యక్షతన ఎన్నుకున్నారు. తండా అధ్యక్షుడిగా కొర్ర కేశవులు ప్రధాన కార్యదర్శిగా రమావత్ రమేశ్, ఉపాధ్యక్షులు ఉజ్వల, కొర్ర రమ, సహయక కార్యదర్శిగా ఆంబోతు రమేశ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా కోటితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బహదూర్, ఉపసర్పంచ్ బద్రినాథ్గుప్తా, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్ గౌడ్, పల్లె జంగారెడ్డి పాల్గొన్నారు.